విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఈ దశలో బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి వైభవం చూస్తాడని.. రికార్డుల మోత మోగిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. మిడ్ రేంజ్ ఫ్యామిలీ మూవీస్ చేసుకునే వెంకీ.. తన మార్కు సినిమాతోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఆయన కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది.
సంక్రాంతి రేసులో చివరగా రిలీజైన ఈ చిత్రం.. చాలా వేగంగా బాక్సాఫీస్ లీడర్గా మారింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలను వెనక్కి నెట్టి భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమా కావడం దీనికి పెద్ద ప్లస్ అయింది. టికెట్ల ధరలు కూడా నార్మల్గానే ఉండడంతో ఫ్యామిలీస్ థియేటర్లకు పోటెత్తుతున్నాయి. రెండో వీకెండ్లో కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కొత్త సినిమా తరహలో హౌస్ ఫుల్స్తో రన్ అయింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’కు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత మామూలుగా రెండో వారం చెప్పుకోదగ్గ రిలీజ్లు ఏమీ ఉండవు. పండక్కి వచ్చే సినిమాలకే తర్వాతి వారాన్ని కూడా వదిలిపెట్టేస్తారు. రిపబ్లిక్ డే వీకెండ్లో కొత్త చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. గత శుక్రవారం అరడజను చిన్న సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవి కూడా కొంచెం కూడా సౌండ్ చేయలేకపోయాయి.
ఇక ఈ వీకెండ్లో సైతం చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. తమిళ అనువాదం ‘మదగజ రాజా’ కాస్త చెప్పుకోదగ్గ చిత్రం. దీనికి కూడా బజ్ అంతంతమాత్రమే. ఈ పాత సినిమాను తమిళ ప్రేక్షకులు ఎగబడి చూసినట్లు తెలుగు వాళ్లు చూసే పరిస్థితి లేదు. మిగతా వాటి గురించి ప్రస్తావించే పని కూడా లేదు. ఈ వీకెండ్లో కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’కు ఎదురు లేనట్లే. వీకెండ్లో సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ‘తండేల్’ వచ్చే వరకు వెంకీ సినిమాకు ఎదురు లేనట్లే.
This post was last modified on January 29, 2025 3:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…