ఓటిటి ప్లాట్ఫామ్ ద్వారా విడుదలయ్యే సినిమాకి టాక్ బ్యాడ్గా వచ్చినా కానీ సబ్స్క్రయిబర్లు ఏదో ఒక సమయంలో సినిమా చూసేస్తారు. నిశ్శబ్దం విషయంలో అదే రుజువయింది. ఈ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ స్ట్రీమింగ్ అవర్స్ పరంగా రికార్డు సృష్టించింది. అనుష్క కథానాయిక కావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. బాహుబలి వల్ల అనుష్కకి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. దీంతో ఈ చిత్రానికి నాన్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా వ్యూస్ భారీ స్థాయిలో వచ్చాయి.
మాధవన్ కూడా తమిళనాడుతో పాటు హిందీ మార్కెట్లలో బాగా తెలిసిన నటుడు కావడం ఈ చిత్రానికి మరింత హెల్ప్ అయింది. థియేటర్లలో విడుదలై వుంటే ఈ చిత్రానికి వసూళ్లు రావడం చాలా కష్టమయ్యేది. కానీ ఓటిటి రిలీజ్ వల్ల ఈ చిత్రం రీచ్ బాగా పెరిగింది. ఈ చిత్రంపై భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లకి టాక్ చూసి గుబులు పుట్టినా కానీ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కనుక ఇప్పుడు బెంగ ఏమీ లేదట.
కాకపోతే ఈ సినిమా వల్ల తమకు మరిన్ని సబ్స్క్రిప్షన్లు వస్తాయని భావిస్తే ఆ విధంగా ఈ చిత్రం ప్లస్ కాలేకపోయింది. నాని ‘వి’ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వ్యూస్ వచ్చినా కానీ యూజర్ డేటాబేస్ పెంచడంలో ఆ చిత్రం ఏమంత దోహద పడలేకపోయింది.
This post was last modified on October 18, 2020 1:49 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…