ఓటిటి ప్లాట్ఫామ్ ద్వారా విడుదలయ్యే సినిమాకి టాక్ బ్యాడ్గా వచ్చినా కానీ సబ్స్క్రయిబర్లు ఏదో ఒక సమయంలో సినిమా చూసేస్తారు. నిశ్శబ్దం విషయంలో అదే రుజువయింది. ఈ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ స్ట్రీమింగ్ అవర్స్ పరంగా రికార్డు సృష్టించింది. అనుష్క కథానాయిక కావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. బాహుబలి వల్ల అనుష్కకి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. దీంతో ఈ చిత్రానికి నాన్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా వ్యూస్ భారీ స్థాయిలో వచ్చాయి.
మాధవన్ కూడా తమిళనాడుతో పాటు హిందీ మార్కెట్లలో బాగా తెలిసిన నటుడు కావడం ఈ చిత్రానికి మరింత హెల్ప్ అయింది. థియేటర్లలో విడుదలై వుంటే ఈ చిత్రానికి వసూళ్లు రావడం చాలా కష్టమయ్యేది. కానీ ఓటిటి రిలీజ్ వల్ల ఈ చిత్రం రీచ్ బాగా పెరిగింది. ఈ చిత్రంపై భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లకి టాక్ చూసి గుబులు పుట్టినా కానీ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కనుక ఇప్పుడు బెంగ ఏమీ లేదట.
కాకపోతే ఈ సినిమా వల్ల తమకు మరిన్ని సబ్స్క్రిప్షన్లు వస్తాయని భావిస్తే ఆ విధంగా ఈ చిత్రం ప్లస్ కాలేకపోయింది. నాని ‘వి’ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వ్యూస్ వచ్చినా కానీ యూజర్ డేటాబేస్ పెంచడంలో ఆ చిత్రం ఏమంత దోహద పడలేకపోయింది.
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో…
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు…