ఓటిటి ప్లాట్ఫామ్ ద్వారా విడుదలయ్యే సినిమాకి టాక్ బ్యాడ్గా వచ్చినా కానీ సబ్స్క్రయిబర్లు ఏదో ఒక సమయంలో సినిమా చూసేస్తారు. నిశ్శబ్దం విషయంలో అదే రుజువయింది. ఈ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ స్ట్రీమింగ్ అవర్స్ పరంగా రికార్డు సృష్టించింది. అనుష్క కథానాయిక కావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. బాహుబలి వల్ల అనుష్కకి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. దీంతో ఈ చిత్రానికి నాన్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా వ్యూస్ భారీ స్థాయిలో వచ్చాయి.
మాధవన్ కూడా తమిళనాడుతో పాటు హిందీ మార్కెట్లలో బాగా తెలిసిన నటుడు కావడం ఈ చిత్రానికి మరింత హెల్ప్ అయింది. థియేటర్లలో విడుదలై వుంటే ఈ చిత్రానికి వసూళ్లు రావడం చాలా కష్టమయ్యేది. కానీ ఓటిటి రిలీజ్ వల్ల ఈ చిత్రం రీచ్ బాగా పెరిగింది. ఈ చిత్రంపై భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లకి టాక్ చూసి గుబులు పుట్టినా కానీ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కనుక ఇప్పుడు బెంగ ఏమీ లేదట.
కాకపోతే ఈ సినిమా వల్ల తమకు మరిన్ని సబ్స్క్రిప్షన్లు వస్తాయని భావిస్తే ఆ విధంగా ఈ చిత్రం ప్లస్ కాలేకపోయింది. నాని ‘వి’ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వ్యూస్ వచ్చినా కానీ యూజర్ డేటాబేస్ పెంచడంలో ఆ చిత్రం ఏమంత దోహద పడలేకపోయింది.
This post was last modified on October 18, 2020 1:49 pm
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…