ధనుష్ను కేవలం ఒక తమిళ నటుడిగా చూడరు భారతీయ ప్రేక్షకులు. తెలుగులో ‘సర్’ మూవీతో అతను ఇక్కడి ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యాడు. అంతకంటే ముందు తన అనువాద చిత్రాలు మంచి ఫలితాలు సాధించాయి. మరోవైపు బాలీవుడ్లో ఎప్పుడో జెండా పాతాడు ధనుష్. హిందీలో తన తొలి చిత్రం ‘రాన్ జానా’ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన రెండు సినిమాల్లోనూ ధనుష్కు మంచి పేరొచ్చింది.
కానీ ‘రాన్ జానా’ నటుడిగా అతణ్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటారు అక్కడి జనం. ఆ సినిమా వచ్చిన దశాబ్దం తర్వాత.. మళ్లీ అలాంటి సినిమా ఒకటి చేయబోతున్నాడు ధనుష్. ఈ తమిళ నటుడిని ఎంతగానో ఇష్టపడే బాలీవుడ్ దర్శక నిర్మాత ఆనంద్.ఎల్.రాయ్.. తనతో మూడో సినిమా చేయబోతున్నాడు. అదే.. తేరే ఇష్క్ మే.
‘రాన్ జానా’ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించనుంది. ‘రాన్ జానా’కు అద్భుతమైన సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ సైతం ఈ ప్రాజెక్టుకు పని చేయబోతున్నాడు. మళ్లీ రాన్జానా ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తూ.. రెండు టీజర్లను వదిలింది చిత్ర బృందం. ధనుష్ను శంకర్గా, కృతిని ముక్తిగా పరిచయం చేస్తూ రెండు ఇంట్రో టీజర్లు డిజైన్ చేశారు. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
రెండింట్లోనూ విజువల్స్ అదిరిపోయాయి. డైలాగులు బాగున్నాయి. రెండు పాత్రల మీద ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ధనుష్, కృతిల లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అన్నింటికీ మించి ఏఆర్ రెహమాన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్తో తన వింటేజ్ ఫామ్ను గుర్తు చేశాడు. ధనుష్-ఆనంద్-రెహమాన్ త్రయం మరోసారి వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న సంకేతాలను ఈ టీజర్లు ఇచ్చాయి. ఈ ఏడాది చివర్లో ‘తేరే ఇష్క్ మే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…