Movie News

ధనుష్… హిందీలో మళ్లీ మ్యాజికల్ మూవీ?

ధనుష్‌ను కేవలం ఒక తమిళ నటుడిగా చూడరు భారతీయ ప్రేక్షకులు. తెలుగులో ‘సర్’ మూవీతో అతను ఇక్కడి ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యాడు. అంతకంటే ముందు తన అనువాద చిత్రాలు మంచి ఫలితాలు సాధించాయి. మరోవైపు బాలీవుడ్లో ఎప్పుడో జెండా పాతాడు ధనుష్. హిందీలో తన తొలి చిత్రం ‘రాన్ జానా’ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన రెండు సినిమాల్లోనూ ధనుష్‌కు మంచి పేరొచ్చింది.

కానీ ‘రాన్ జానా’ నటుడిగా అతణ్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటారు అక్కడి జనం. ఆ సినిమా వచ్చిన దశాబ్దం తర్వాత.. మళ్లీ అలాంటి సినిమా ఒకటి చేయబోతున్నాడు ధనుష్. ఈ తమిళ నటుడిని ఎంతగానో ఇష్టపడే బాలీవుడ్ దర్శక నిర్మాత ఆనంద్.ఎల్.రాయ్.. తనతో మూడో సినిమా చేయబోతున్నాడు. అదే.. తేరే ఇష్క్ మే.

‘రాన్ జానా’ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించనుంది. ‘రాన్ జానా’కు అద్భుతమైన సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ సైతం ఈ ప్రాజెక్టుకు పని చేయబోతున్నాడు. మళ్లీ రాన్‌జానా ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తూ.. రెండు టీజర్లను వదిలింది చిత్ర బృందం. ధనుష్‌ను శంకర్‌గా, కృతిని ముక్తిగా పరిచయం చేస్తూ రెండు ఇంట్రో టీజర్లు డిజైన్ చేశారు. అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

రెండింట్లోనూ విజువల్స్ అదిరిపోయాయి. డైలాగులు బాగున్నాయి. రెండు పాత్రల మీద ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ధనుష్, కృతిల లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అన్నింటికీ మించి ఏఆర్ రెహమాన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో తన వింటేజ్ ఫామ్‌ను గుర్తు చేశాడు. ధనుష్-ఆనంద్-రెహమాన్ త్రయం మరోసారి వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న సంకేతాలను ఈ టీజర్లు ఇచ్చాయి. ఈ ఏడాది చివర్లో ‘తేరే ఇష్క్ మే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 28, 2025 6:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

8 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

48 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

60 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago