బింబిసార దర్శకుడు వశిష్ట, చిరంజీవి కలయికలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఏ దశలో ఉందనేది నిర్మాతలు బయటికి చెప్పడం లేదు. సరే దీని సంగతలా ఉంచితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అసలు విషయం వేరే ఉంది.
గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన మెగా టీమ్ ఇంకా ఇంత వర్క్ పెండింగ్ పెట్టుకోవడం విచిత్రమే. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని విఎఫ్ఎక్స్ టీమ్ మొత్తాన్ని మార్చారనే వార్తల నేపథ్యంలో రిలీజ్ డేట్ గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ప్రాథమికంగా విశ్వంభర లాక్ చేసుకున్న తేదీ మే 9. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన డేట్ కాబట్టి సెంటిమెంట్ గానూ బాగుంటుందనేది యూనిట్ అభిప్రాయం. ఒకవేళ అదే అనుకుంటే ముందైతే అనౌన్స్ మెంట్ ఇవ్వడం అవసరం.
ఎందుకంటే చాలా భారీ సినిమాలు స్లాట్స్ కోసం వెతుక్కుంటున్న టైంలో లేట్ గా ప్రకటన ఇవ్వడం వల్ల విమర్శలకు తావిచ్చినట్టవుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చడం బెటర్. తాజాగా పాటల రికార్డింగ్ ఫోటోలు పెట్టిన వశిష్ట మొన్న ఖైదీలో కొండపల్లి సీన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఉత్సుకత రేపాడు.
అసలే హరిహర వీరమల్లు మార్చ్ 28 వస్తుందా రాదానే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సతమతమవుతున్నారు. పోస్టర్లలో వాయిదా లేదని నొక్కి చెబుతున్నారు కానీ అదే డేట్ కి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, కాళీ లాంటివి రావడం చూస్తే కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి.
దీనికి విశ్వంభరకు సంబంధం లేకపోయినా రెండింటి మధ్య కనీసం ఏడెనిమిది వారాలు గ్యాప్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముందైతే విశ్వంభర కొత్త ప్రమోషన్లు మొదలుపెట్టడం అవసరం. హైప్ పెంచాలంటే కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందనే నమ్మకం కలిగించాలి. యువి క్రియేషన్స్ మెగాస్టార్ కెరీర్లోనే భారీ బడ్జెట్ దీని మీద పెట్టింది.
This post was last modified on January 28, 2025 5:35 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…