రొటీన్ సినిమాలు తీస్తాడని విమర్శించొచ్చు.. పాత సినిమాలనే అటు ఇటు తిప్పి కిచిడీ కథలు తయారు చేస్తారని ఎద్దేవా చేయొచ్చు.. కొత్తదనం రవ్వంతైనా ఉండదని తీసిపారేయొచ్చ.. కానీ ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి చిత్రం ‘రాజా రాణి’ నుంచి చివరగా హిందీలో షారుఖ్ ఖాన్తో తీసిన ‘జవాన్’ వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. ‘జవాన్’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా.. ఇంకా తన కొత్త చిత్రం మాత్రం ప్రకటించలేదు.
తన ఆరో సినిమాలో హీరో అంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు. ఐతే ఇప్పుడు అట్లీ ఓ మెగా మల్టీస్టారర్కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ల క్రేజీ కాంబినేషన్లో అట్లీ సినిమా తీయబోతున్నాడట. రజినీకాంత్, సల్మాన్ ఖాన్.. వీరిలో ఏ ఒక్కరితో అట్లీ సినిమా అనౌన్స్ చేసినా హైప్ మామూలుగా ఉండదు.
అలాంటిది ఈ ఇద్దరు సూపర్ స్టార్లను కలిపి మల్టీస్టారర్ అంటే దీని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది. వేరే హీరోల సినిమాల్లో సల్మాన్ క్యామియోలు చేయడం మామూలే. కానీ ఆయన మల్టీస్టారర్ చేసి చాలా కాలం అయింది. రజినీ కూడా 80వ దశకం వరకు మల్టీస్టారర్లు, క్యామియోలు చేశాడు కానీ.. తర్వాత చాలా వరకు సోలో హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ‘కథానాయకుడు’ ఒకటి మినహాయింపు.
మరి కెరీర్లో ఈ దశలో రజినీ, సల్మాన్ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకోవడమే పెద్ద విశేషం అవుతుంది. ఈ వార్త నిజం అయితే మాత్రం ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీస్లో ఒకటిగా మారే అవకాశముంది. మరి అట్లీ నుంచి ఏం ప్రకటన వస్తుందో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:31 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…