రొటీన్ సినిమాలు తీస్తాడని విమర్శించొచ్చు.. పాత సినిమాలనే అటు ఇటు తిప్పి కిచిడీ కథలు తయారు చేస్తారని ఎద్దేవా చేయొచ్చు.. కొత్తదనం రవ్వంతైనా ఉండదని తీసిపారేయొచ్చ.. కానీ ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి చిత్రం ‘రాజా రాణి’ నుంచి చివరగా హిందీలో షారుఖ్ ఖాన్తో తీసిన ‘జవాన్’ వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. ‘జవాన్’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా.. ఇంకా తన కొత్త చిత్రం మాత్రం ప్రకటించలేదు.
తన ఆరో సినిమాలో హీరో అంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు. ఐతే ఇప్పుడు అట్లీ ఓ మెగా మల్టీస్టారర్కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ల క్రేజీ కాంబినేషన్లో అట్లీ సినిమా తీయబోతున్నాడట. రజినీకాంత్, సల్మాన్ ఖాన్.. వీరిలో ఏ ఒక్కరితో అట్లీ సినిమా అనౌన్స్ చేసినా హైప్ మామూలుగా ఉండదు.
అలాంటిది ఈ ఇద్దరు సూపర్ స్టార్లను కలిపి మల్టీస్టారర్ అంటే దీని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది. వేరే హీరోల సినిమాల్లో సల్మాన్ క్యామియోలు చేయడం మామూలే. కానీ ఆయన మల్టీస్టారర్ చేసి చాలా కాలం అయింది. రజినీ కూడా 80వ దశకం వరకు మల్టీస్టారర్లు, క్యామియోలు చేశాడు కానీ.. తర్వాత చాలా వరకు సోలో హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ‘కథానాయకుడు’ ఒకటి మినహాయింపు.
మరి కెరీర్లో ఈ దశలో రజినీ, సల్మాన్ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకోవడమే పెద్ద విశేషం అవుతుంది. ఈ వార్త నిజం అయితే మాత్రం ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీస్లో ఒకటిగా మారే అవకాశముంది. మరి అట్లీ నుంచి ఏం ప్రకటన వస్తుందో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:31 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…