రొటీన్ సినిమాలు తీస్తాడని విమర్శించొచ్చు.. పాత సినిమాలనే అటు ఇటు తిప్పి కిచిడీ కథలు తయారు చేస్తారని ఎద్దేవా చేయొచ్చు.. కొత్తదనం రవ్వంతైనా ఉండదని తీసిపారేయొచ్చ.. కానీ ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి చిత్రం ‘రాజా రాణి’ నుంచి చివరగా హిందీలో షారుఖ్ ఖాన్తో తీసిన ‘జవాన్’ వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. ‘జవాన్’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా.. ఇంకా తన కొత్త చిత్రం మాత్రం ప్రకటించలేదు.
తన ఆరో సినిమాలో హీరో అంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు. ఐతే ఇప్పుడు అట్లీ ఓ మెగా మల్టీస్టారర్కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ల క్రేజీ కాంబినేషన్లో అట్లీ సినిమా తీయబోతున్నాడట. రజినీకాంత్, సల్మాన్ ఖాన్.. వీరిలో ఏ ఒక్కరితో అట్లీ సినిమా అనౌన్స్ చేసినా హైప్ మామూలుగా ఉండదు.
అలాంటిది ఈ ఇద్దరు సూపర్ స్టార్లను కలిపి మల్టీస్టారర్ అంటే దీని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది. వేరే హీరోల సినిమాల్లో సల్మాన్ క్యామియోలు చేయడం మామూలే. కానీ ఆయన మల్టీస్టారర్ చేసి చాలా కాలం అయింది. రజినీ కూడా 80వ దశకం వరకు మల్టీస్టారర్లు, క్యామియోలు చేశాడు కానీ.. తర్వాత చాలా వరకు సోలో హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ‘కథానాయకుడు’ ఒకటి మినహాయింపు.
మరి కెరీర్లో ఈ దశలో రజినీ, సల్మాన్ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకోవడమే పెద్ద విశేషం అవుతుంది. ఈ వార్త నిజం అయితే మాత్రం ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీస్లో ఒకటిగా మారే అవకాశముంది. మరి అట్లీ నుంచి ఏం ప్రకటన వస్తుందో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:31 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…