Movie News

కోర్టులో నయన్‌పై ధనుష్‌దే పైచేయి

కొన్ని నెలల కిందట తమిళ నటులు నయనతార-ధనుష్‌ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.

ఈ వివాదంలో కొందరు ధనుష్‌ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్‌ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఆపై కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్‌ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.

దీని మీద ధనుష్ పేరెత్తకుండా నయన్ కౌంటర్ కూడా వేసింది. ఈ వివాదం విషయంలో తర్వాత ఏ అప్‌డేట్ లేదు. ఐతే ఇప్పుడు కోర్టులో ధనుష్.. నయన్ మీద పైచేయి సాధించాడు. ధనుష్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ నెట్ ఫ్లిక్స్ వేషిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ వ్యవహారంలో నయన్‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు చిక్కులు తప్పవని స్పష్టమవుతోంది. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’కు సంబంధించి కొన్ని సెకన్ల ఫుటేజీని మాత్రమే వాడారు.

అయినా ధనుష్ అంత అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ దీని వెనుక వేరే గొడవ ఉందని తెలుస్తోంది. ‘నానుం రౌడీ దా’ సినిమా బడ్జెట్‌ను బాగా పెంచేసి ధనుష్‌ను నయన్ భర్త విఘ్నేష్ చిక్కుల్లోకి నెట్టాడని.. తర్వాత ధనుష్ అంటే లెక్కలేనట్లు వ్యవహరించాడని ఓ వాదన తెరపైకి వచ్చింది.

ఐతే ధనుష్ కోసం ఒకప్పుడు ‘ఎదిర్ నీచ్చిల్’ సినిమాలో నయన్ ఫ్రీగా ఐటెం సాంగ్ చేసిందని.. అలాంటి అమ్మాయితో ఇలా వ్యవహరించడం ఏంటని ఆమె మద్దతుదారులు ధనుష్‌ను తప్పుబడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

This post was last modified on January 28, 2025 4:23 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

17 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

34 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

49 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

10 hours ago