కొన్ని నెలల కిందట తమిళ నటులు నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఆపై కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.
దీని మీద ధనుష్ పేరెత్తకుండా నయన్ కౌంటర్ కూడా వేసింది. ఈ వివాదం విషయంలో తర్వాత ఏ అప్డేట్ లేదు. ఐతే ఇప్పుడు కోర్టులో ధనుష్.. నయన్ మీద పైచేయి సాధించాడు. ధనుష్ పిటిషన్ను కొట్టివేయాలంటూ నెట్ ఫ్లిక్స్ వేషిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ వ్యవహారంలో నయన్కు, నెట్ఫ్లిక్స్కు చిక్కులు తప్పవని స్పష్టమవుతోంది. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’కు సంబంధించి కొన్ని సెకన్ల ఫుటేజీని మాత్రమే వాడారు.
అయినా ధనుష్ అంత అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ దీని వెనుక వేరే గొడవ ఉందని తెలుస్తోంది. ‘నానుం రౌడీ దా’ సినిమా బడ్జెట్ను బాగా పెంచేసి ధనుష్ను నయన్ భర్త విఘ్నేష్ చిక్కుల్లోకి నెట్టాడని.. తర్వాత ధనుష్ అంటే లెక్కలేనట్లు వ్యవహరించాడని ఓ వాదన తెరపైకి వచ్చింది.
ఐతే ధనుష్ కోసం ఒకప్పుడు ‘ఎదిర్ నీచ్చిల్’ సినిమాలో నయన్ ఫ్రీగా ఐటెం సాంగ్ చేసిందని.. అలాంటి అమ్మాయితో ఇలా వ్యవహరించడం ఏంటని ఆమె మద్దతుదారులు ధనుష్ను తప్పుబడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:23 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…