తెలుగమ్మాయిలను తెలుగు చిత్ర పరిశ్రమ చిన్న చూపు చూస్తుందనేది ఎప్పట్నుంచో వున్న విమర్శ. టెక్నికల్గా రీతు వర్మ తెలుగమ్మాయి కాదు కానీ హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది కనుక తెలుగమ్మాయే అనుకోవచ్చు. అందుకేనేమో తెలుగు చిత్ర పరిశ్రమ ఈమె టాలెంట్ని చిన్నచూపు చూస్తోంది.
పెళ్లిచూపులు సినిమాకు ముందే షార్ట్ ఫిలింస్తో రీతు వర్మ తన టాలెంట్ ఏమిటనేది చూపించింది. పెళ్లిచూపులు చిత్రం అంత పెద్ద హిట్టయినా కానీ రీతు వర్మకు అవకాశాలు రాలేదు. ఆమె మళ్లీ జనం దృష్టిలో పడింది ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంతోనే. ఇందులో చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేసిన రీతు వర్మ తన టాలెంట్ ఏమిటనేది మళ్లీ చాటుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ‘పుదమ్ పుదు కాలై’ అనే ఆ చిత్రం అయిదు కథల సమాహారం.
అయిదుగురు దర్శకులు రూపొందించిన వివిధ షార్ట్ ఫిలింస్ ఒకే సినిమాగా విడుదలయ్యాయి. ఇందులో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఫిలింలో లీడ్ క్యారెక్టర్ చేసింది రీతు వర్మ. ఎప్పట్లానే గౌతమ్ తన హీరోయిన్ని చాలా ప్రత్యేకంగా చూపించాడు. రీతు వర్మ తన అభినయంతో ఆ పాత్రను రక్తి కట్టించి సోషల్ మీడియా ద్వారా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికైనా ఈ అండర్ రేటెడ్ బ్యూటీ టాలెంట్ని గుర్తించి టాలీవుడ్ తగినన్ని అవకాశాలు ఇస్తుందా లేదా అనేది చూడాలి.
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…