Movie News

రాత్రి 11…థియేటర్లలో నో ఎంట్రీ…నిజంగా సమస్యేనా

రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్ళ లోపు పిల్లలను థియేటర్లలో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించడం గురించి పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇది అమలులోకి వస్తే కలిగే ఇబ్బందులను బేరీజు వేసుకునే పనిలో ఎగ్జిబిటర్లున్నారు.

హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు మినహాయించి దాదాపు అన్ని కేంద్రాల్లో రాత్రి పది నుంచి పదిన్నర మధ్యలో సెకండ్ షో మొదలైపోతోంది. ఏదైనా పండగ లేదా పెద్ద హీరోల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే లేట్ నైట్ షోలు ఉంటాయి కానీ మిగిలిన రోజుల్లో అసలా అవసరమే లేదు.

అలాంటప్పుడు ఇదో పెద్ద సమస్య కాదనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. మల్టీప్లెక్సుల్లో మాత్రమే సాధారణంగా 11 గంటల షోలు ఉంటాయి. ఎప్పుడో రెండు గంటలకు బయటికి వచ్చే అలాంటి సినిమాలకు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్లడం తక్కువ. వీకెండ్ లో మాములే.

ఒకవేళ నిజంగా కట్టడి చేయాల్సి వస్తే మల్టీప్లెక్సులు యాజమాన్యాలకు ఇది ప్రాబ్లెమ్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో నిబంధనలను కఠినంగా పాటిస్తున్నాయి కాబట్టి. సో దీన్ని మేనేజ్ చేసుకుంటారు. ఇక సింగల్ స్క్రీన్లు సిబ్బంది కొరత దృష్ట్యా పది లోపే చివరి ఆట వేస్తాయి కనక టెన్షన్ లేదు.

ఎలా చూసుకున్నా ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన మ్యాటర్ కాదు. కాకపోతే ఇప్పటికే మిడ్ నైట్ షోల నియంత్రణ, ఫ్యాన్స్ సెలబ్రేషన్ల మీద ఆంక్షల వల్ల థియేటర్లు కొంత ప్రతికూల ప్రభావం చూస్తున్నప్పటికీ మంచి ఫలితాల దిశగా అమలవుతున్న సంస్కరణలు కాబట్టి క్రమంగా అలవాటు చేసుకోవాలి.

ప్రస్తుతానికి ఇది తెలంగాణకే పరిమితమైన వ్యవహారమే అయినా భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇలాంటి మార్పులు చూసే అవకాశం లేకపోలేదు. చిన్న కొసమెరుపు ఏంటంటే పదకొండు తర్వాత నో ఎంట్రీ అన్నారు కనక చివరి షో పది గంటల యాభై అయిదు నిమిషాల వరకు వేసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని వాడుకోవచ్చు.

Kumar

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

2 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

3 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

3 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

4 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

4 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

5 hours ago