రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్ళ లోపు పిల్లలను థియేటర్లలో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించడం గురించి పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇది అమలులోకి వస్తే కలిగే ఇబ్బందులను బేరీజు వేసుకునే పనిలో ఎగ్జిబిటర్లున్నారు.
హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు మినహాయించి దాదాపు అన్ని కేంద్రాల్లో రాత్రి పది నుంచి పదిన్నర మధ్యలో సెకండ్ షో మొదలైపోతోంది. ఏదైనా పండగ లేదా పెద్ద హీరోల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే లేట్ నైట్ షోలు ఉంటాయి కానీ మిగిలిన రోజుల్లో అసలా అవసరమే లేదు.
అలాంటప్పుడు ఇదో పెద్ద సమస్య కాదనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. మల్టీప్లెక్సుల్లో మాత్రమే సాధారణంగా 11 గంటల షోలు ఉంటాయి. ఎప్పుడో రెండు గంటలకు బయటికి వచ్చే అలాంటి సినిమాలకు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్లడం తక్కువ. వీకెండ్ లో మాములే.
ఒకవేళ నిజంగా కట్టడి చేయాల్సి వస్తే మల్టీప్లెక్సులు యాజమాన్యాలకు ఇది ప్రాబ్లెమ్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో నిబంధనలను కఠినంగా పాటిస్తున్నాయి కాబట్టి. సో దీన్ని మేనేజ్ చేసుకుంటారు. ఇక సింగల్ స్క్రీన్లు సిబ్బంది కొరత దృష్ట్యా పది లోపే చివరి ఆట వేస్తాయి కనక టెన్షన్ లేదు.
ఎలా చూసుకున్నా ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన మ్యాటర్ కాదు. కాకపోతే ఇప్పటికే మిడ్ నైట్ షోల నియంత్రణ, ఫ్యాన్స్ సెలబ్రేషన్ల మీద ఆంక్షల వల్ల థియేటర్లు కొంత ప్రతికూల ప్రభావం చూస్తున్నప్పటికీ మంచి ఫలితాల దిశగా అమలవుతున్న సంస్కరణలు కాబట్టి క్రమంగా అలవాటు చేసుకోవాలి.
ప్రస్తుతానికి ఇది తెలంగాణకే పరిమితమైన వ్యవహారమే అయినా భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇలాంటి మార్పులు చూసే అవకాశం లేకపోలేదు. చిన్న కొసమెరుపు ఏంటంటే పదకొండు తర్వాత నో ఎంట్రీ అన్నారు కనక చివరి షో పది గంటల యాభై అయిదు నిమిషాల వరకు వేసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని వాడుకోవచ్చు.
This post was last modified on January 28, 2025 10:54 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…