రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్ళ లోపు పిల్లలను థియేటర్లలో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించడం గురించి పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇది అమలులోకి వస్తే కలిగే ఇబ్బందులను బేరీజు వేసుకునే పనిలో ఎగ్జిబిటర్లున్నారు.
హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు మినహాయించి దాదాపు అన్ని కేంద్రాల్లో రాత్రి పది నుంచి పదిన్నర మధ్యలో సెకండ్ షో మొదలైపోతోంది. ఏదైనా పండగ లేదా పెద్ద హీరోల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే లేట్ నైట్ షోలు ఉంటాయి కానీ మిగిలిన రోజుల్లో అసలా అవసరమే లేదు.
అలాంటప్పుడు ఇదో పెద్ద సమస్య కాదనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. మల్టీప్లెక్సుల్లో మాత్రమే సాధారణంగా 11 గంటల షోలు ఉంటాయి. ఎప్పుడో రెండు గంటలకు బయటికి వచ్చే అలాంటి సినిమాలకు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్లడం తక్కువ. వీకెండ్ లో మాములే.
ఒకవేళ నిజంగా కట్టడి చేయాల్సి వస్తే మల్టీప్లెక్సులు యాజమాన్యాలకు ఇది ప్రాబ్లెమ్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో నిబంధనలను కఠినంగా పాటిస్తున్నాయి కాబట్టి. సో దీన్ని మేనేజ్ చేసుకుంటారు. ఇక సింగల్ స్క్రీన్లు సిబ్బంది కొరత దృష్ట్యా పది లోపే చివరి ఆట వేస్తాయి కనక టెన్షన్ లేదు.
ఎలా చూసుకున్నా ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన మ్యాటర్ కాదు. కాకపోతే ఇప్పటికే మిడ్ నైట్ షోల నియంత్రణ, ఫ్యాన్స్ సెలబ్రేషన్ల మీద ఆంక్షల వల్ల థియేటర్లు కొంత ప్రతికూల ప్రభావం చూస్తున్నప్పటికీ మంచి ఫలితాల దిశగా అమలవుతున్న సంస్కరణలు కాబట్టి క్రమంగా అలవాటు చేసుకోవాలి.
ప్రస్తుతానికి ఇది తెలంగాణకే పరిమితమైన వ్యవహారమే అయినా భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇలాంటి మార్పులు చూసే అవకాశం లేకపోలేదు. చిన్న కొసమెరుపు ఏంటంటే పదకొండు తర్వాత నో ఎంట్రీ అన్నారు కనక చివరి షో పది గంటల యాభై అయిదు నిమిషాల వరకు వేసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని వాడుకోవచ్చు.
This post was last modified on January 28, 2025 10:54 am
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…