రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్ళ లోపు పిల్లలను థియేటర్లలో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించడం గురించి పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇది అమలులోకి వస్తే కలిగే ఇబ్బందులను బేరీజు వేసుకునే పనిలో ఎగ్జిబిటర్లున్నారు.
హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు మినహాయించి దాదాపు అన్ని కేంద్రాల్లో రాత్రి పది నుంచి పదిన్నర మధ్యలో సెకండ్ షో మొదలైపోతోంది. ఏదైనా పండగ లేదా పెద్ద హీరోల రిలీజ్ ఉన్నప్పుడు మాత్రమే లేట్ నైట్ షోలు ఉంటాయి కానీ మిగిలిన రోజుల్లో అసలా అవసరమే లేదు.
అలాంటప్పుడు ఇదో పెద్ద సమస్య కాదనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. మల్టీప్లెక్సుల్లో మాత్రమే సాధారణంగా 11 గంటల షోలు ఉంటాయి. ఎప్పుడో రెండు గంటలకు బయటికి వచ్చే అలాంటి సినిమాలకు ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్లడం తక్కువ. వీకెండ్ లో మాములే.
ఒకవేళ నిజంగా కట్టడి చేయాల్సి వస్తే మల్టీప్లెక్సులు యాజమాన్యాలకు ఇది ప్రాబ్లెమ్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో నిబంధనలను కఠినంగా పాటిస్తున్నాయి కాబట్టి. సో దీన్ని మేనేజ్ చేసుకుంటారు. ఇక సింగల్ స్క్రీన్లు సిబ్బంది కొరత దృష్ట్యా పది లోపే చివరి ఆట వేస్తాయి కనక టెన్షన్ లేదు.
ఎలా చూసుకున్నా ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన మ్యాటర్ కాదు. కాకపోతే ఇప్పటికే మిడ్ నైట్ షోల నియంత్రణ, ఫ్యాన్స్ సెలబ్రేషన్ల మీద ఆంక్షల వల్ల థియేటర్లు కొంత ప్రతికూల ప్రభావం చూస్తున్నప్పటికీ మంచి ఫలితాల దిశగా అమలవుతున్న సంస్కరణలు కాబట్టి క్రమంగా అలవాటు చేసుకోవాలి.
ప్రస్తుతానికి ఇది తెలంగాణకే పరిమితమైన వ్యవహారమే అయినా భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇలాంటి మార్పులు చూసే అవకాశం లేకపోలేదు. చిన్న కొసమెరుపు ఏంటంటే పదకొండు తర్వాత నో ఎంట్రీ అన్నారు కనక చివరి షో పది గంటల యాభై అయిదు నిమిషాల వరకు వేసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని వాడుకోవచ్చు.
This post was last modified on January 28, 2025 10:54 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…