అందని ఎత్తులో ఉన్న వాళ్ళను లక్ష్యంగా చేసుకునే బ్యాచ్ సోషల్ మీడియాలో అంతకంతా పెరుగుతోంది. దానికి దర్శక ధీర రాజమౌళి మినహాయింపు కాదు. ఇటీవలే ప్రకటించిన పద్మ పురస్కార విజేతలకు శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన వేసిన ట్వీట్ మీద పెద్ద ఎత్తున చర్చ జరగడం మహా విచిత్రం.
అంతగా అందులో ఏముందంటే సందేశం మొదట్లో 7 తెలుగు పీపుల్స్ థిస్ టైం అని పెట్టారు. అంటే ఏడుగురు మనవాళ్ళు పద్మ గౌరవాన్ని అందుకున్నారని అర్థం. ఇది కొందరికి తప్పుగా అనిపించిందట. కేంద్ర ప్రభుత్వం భాషల వారీగా భేదం చూపించలేదు కాబట్టి ప్రత్యేకంగా తెలుగు అని వాడకూడదని సదరు మేధావుల లాజిక్.
నిజానికి అక్కడ తప్పు బట్టేందుకు ఏమి లేదు. ఎందుకంటే రాజమౌళి పక్కా తెలుగువాడు. ఎన్ని వందల వేల కోట్లు పెట్టినా టాలీవుడ్ హీరోలతోనే తీస్తాడు. హిందీ తమిళం ఏదైనా సరే ఆ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేయిస్తాడు తప్పించి రెండు మూడు వెర్షన్లు తీసే అవసరం లేని రిస్కులు తీసుకోడు.
పలు సందర్భాల్లో జక్కన్న దీని గురించి చాలా స్పష్టంగా వివరించాడు. మనం పుట్టిపెరిగిన నేల నుంచి ఎవరైనా ఏదైనా సాధిస్తే మనం గర్వపడతాంగా. ఆ మాటకొస్తే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్ళున్నా ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీమ్ కు మద్దతు ఎందుకు ఇస్తాం. కేవలం హైదరాబాద్ కనెక్షన్ ఉందన్న ఒకే కారణంతో.
అలాంటిది రాజమౌళి తెలుగు వాళ్ళ గురించి గర్వంగా ఫీలవ్వడంతో తప్పేముందో అంతు చిక్కడం లేదు. మరి ధనుష్ ప్రత్యేకంగా అజిత్ ని పొగిడి సాటి తమిళవాడిగా గర్వపడుతున్నానని చెప్పినప్పుడు రాంగ్ అనిపించలేదు. కేవలం రాజమౌళి తెలుగు పీపుల్ అనడం దగ్గరే సమస్య కనిపిస్తోంది. ఇది మరీ విచిత్రం.
ఆర్ఆర్ఆర్, బాహుబలితో టాలీవుడ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న ఇవన్నీ పట్టించుకోడు కానీ ఆయన అందరికీ శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకూడదు. అయినా కేవలం ఒక ఇన్స్ టా పోస్టుతో మీడియాని ఊపేసిన రాజమౌళిని విమర్శించడమంటే ఆకాశంలో రాళ్ళేయడమే. తిరిగి వేసినోళ్లకే పడతాయి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…