మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల కిందట తిరిగి సినిమాల్లోకి రావడం అభిమానులకు అమితానందాన్ని కలిగించిన విషయం. రాజకీయాల్లోకి వెళ్లాక తిరిగి సినిమాల్లోకి వచ్చేదే లేదని తెగేసి చెప్పిన ఆయన.. ఆ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో తిరిగి తనకెంతో ఇష్టమైన రంగానికి వచ్చేశారు. ఐతే రీఎంట్రీ కోసం ఆయన ఎంచుకున్న సినిమా చాలామందికి నచ్చలేదు.
స్ట్రెయిట్ మూవీ కాకుండా.. తమిళ ‘కత్తి’ని రీమేక్ చేయడం వల్ల చిరు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు, ఎలా సర్ప్రైజ్ చేస్తాడు అనే ఆసక్తి లేకపోయింది. అయినా సరే.. చిరు రీఎంట్రీ మూవీ కాబట్టి దాన్ని బాగానే ఆదరించారు ప్రేక్షకులు. ఆ తర్వాత ‘సైరా’తో అభిమానులను అలరించాడు చిరు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ మీదా భారీగానే అంచనాలున్నాయి.
ఐతే మిగతా హీరోలు లాక్ డౌన్ టైంలో కొత్తగా ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటే చిరు మాత్రం వరుసబెట్టి మళ్లీ రీమేక్ల మీద పడటం చాలామందికి మింగుడు పడటం లేదు. ఆల్రెడీ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ కోసం కూడా రంగం సిద్ధం చేశారు. ఈ రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలు. పైగా దాన్ని డీల్ చేస్తున్న డైరెక్టర్లు ఔట్ డేట్ అయిపోయారు. గత కొన్నేళ్లలో భాషల మధ్య హద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో మామూలుగానే రీమేక్లంటే ఆసక్తి ఉండట్లేదు. పైగా చిరు ఎంచుకుంటున్నది రొటీన్ సినిమాలు కావడం నిరాశ కలిగించే విషయం.
ఉన్న రెండు రీమేక్లు సరిపోవని ఇప్పుడు అజిత్ నటించిన తమిళ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ మీద చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కొత్త వార్త బయటికి వచ్చింది. ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో అనువాదమైంది. ఓ మోస్తరుగా ఆడింది కూడా. ‘లూసిఫర్’ లాగా వచ్చింది వెళ్లింది తెలియని సినిమా కాదిది. తెలుగులో రిలీజై, ఓటీటీలో అందుబాటులో ఉన్న, పాత సినిమాను రీమేక్ చేయడానికి చిరుకు ఇంత ఆసక్తి ఏంటో మరి?
This post was last modified on October 17, 2020 6:23 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…