మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల కిందట తిరిగి సినిమాల్లోకి రావడం అభిమానులకు అమితానందాన్ని కలిగించిన విషయం. రాజకీయాల్లోకి వెళ్లాక తిరిగి సినిమాల్లోకి వచ్చేదే లేదని తెగేసి చెప్పిన ఆయన.. ఆ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో తిరిగి తనకెంతో ఇష్టమైన రంగానికి వచ్చేశారు. ఐతే రీఎంట్రీ కోసం ఆయన ఎంచుకున్న సినిమా చాలామందికి నచ్చలేదు.
స్ట్రెయిట్ మూవీ కాకుండా.. తమిళ ‘కత్తి’ని రీమేక్ చేయడం వల్ల చిరు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు, ఎలా సర్ప్రైజ్ చేస్తాడు అనే ఆసక్తి లేకపోయింది. అయినా సరే.. చిరు రీఎంట్రీ మూవీ కాబట్టి దాన్ని బాగానే ఆదరించారు ప్రేక్షకులు. ఆ తర్వాత ‘సైరా’తో అభిమానులను అలరించాడు చిరు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ మీదా భారీగానే అంచనాలున్నాయి.
ఐతే మిగతా హీరోలు లాక్ డౌన్ టైంలో కొత్తగా ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటే చిరు మాత్రం వరుసబెట్టి మళ్లీ రీమేక్ల మీద పడటం చాలామందికి మింగుడు పడటం లేదు. ఆల్రెడీ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ కోసం కూడా రంగం సిద్ధం చేశారు. ఈ రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలు. పైగా దాన్ని డీల్ చేస్తున్న డైరెక్టర్లు ఔట్ డేట్ అయిపోయారు. గత కొన్నేళ్లలో భాషల మధ్య హద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో మామూలుగానే రీమేక్లంటే ఆసక్తి ఉండట్లేదు. పైగా చిరు ఎంచుకుంటున్నది రొటీన్ సినిమాలు కావడం నిరాశ కలిగించే విషయం.
ఉన్న రెండు రీమేక్లు సరిపోవని ఇప్పుడు అజిత్ నటించిన తమిళ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ మీద చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కొత్త వార్త బయటికి వచ్చింది. ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో అనువాదమైంది. ఓ మోస్తరుగా ఆడింది కూడా. ‘లూసిఫర్’ లాగా వచ్చింది వెళ్లింది తెలియని సినిమా కాదిది. తెలుగులో రిలీజై, ఓటీటీలో అందుబాటులో ఉన్న, పాత సినిమాను రీమేక్ చేయడానికి చిరుకు ఇంత ఆసక్తి ఏంటో మరి?
This post was last modified on October 17, 2020 6:23 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…