Movie News

హీరో మార్కెట్ పెరిగింది.. ఆ స్క్రిప్టు బయటికి

యువ కథానాయకుడు రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ టీం అంతా సినిమా ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంది. కానీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లకుండానే ఆగిపోయింది. అందుక్కారణం బడ్జెట్ సమస్యలే అని అప్పుడు వార్తలొచ్చాయి.

రాజశేఖర్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా ‘గరుడవేగ’ను భారీ బడ్జెట్లో తీశాడు ప్రవీణ్. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రామ్‌తో అతను చేయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైతం బడ్జెట్ లెక్కలు ఘనంగా ఉండటంతో ఇది వర్కవుట్ కాదని రవికిషోర్ పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి.

కట్ చేస్తే ప్రవీణ్ ఇంకో రెండేళ్లు సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ అన్నారు కానీ.. అది ఎంతకీ తెగలేదు. ఈ మధ్యే అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది పక్కాగా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో తెలియదు. కాగా రామ్‌, ప్రవీణ్ కాంబినేషన్లో ఇంతకుముందు సెట్ అయిన ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రవీణ్ సినిమా ఆపేశాక రామ్ చేసిన ‘హలో గురూ ప్రేమ కోసమే’ హిట్టయింది.

గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో అతను బ్లాక్‌బస్టర్ విజయాన్నందుకున్నాడు. ఈ సినిమాతో అతడి మార్కెట్ ఎంతో పెరిగింది. దీని తర్వాత చేసిన ‘రెడ్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దానికి మంచి బిజినెస్ కూడా జరిగింది. దీంతో రవికిషోర్‌కు రామ్-ప్రవీణ్ సినిమా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ధైర్యం వచ్చిందట. రామ్, ప్రవీణ్ కమిట్మెంట్లను చూసుకుని ఈ సినిమాను కుదిరినపుడు పట్టాలెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

This post was last modified on October 17, 2020 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

22 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

5 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago