మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో ఉన్న ఆత్మని సరిగ్గా ఒడిసిపట్టుకోలేకపోవడం. సెకండాఫ్ లో చేసిన మార్పులు కూడా కొంత డ్యామేజ్ కి కారణమయ్యాయి. అయితే అంతకు ముందే లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ఓటిటిలో చూసేసిన మన ప్రేక్షకులు మోహన్ లాల్ దే బెటరనే అభిప్రాయానికి వచ్చారు.
అందుకే ఈసారి రీమేక్ గొడవ లేకుండా సీక్వెల్ ని అనువాద రూపంలో తీసుకొస్తున్నారు. ఇవాళ కేరళలో జరిగిన గ్రాండ్ టీజర్ లాంచ్ వివిధ బాషల నుంచి మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి ఘనంగా నిర్వహించారు.
లూసిఫర్ లో కూలిపోయిన రాజకీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టే స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్) కి విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా ఇంకో పేరు ఉంటుంది. అదే అబ్రహం ఖురేషి. పలు అంతర్జాతీయ సంస్థలు అతన్ని పట్టుకోవడానికి పధకాలు వేస్తూ ఉంటాయి.
అయితే ఎక్కడో కేరళలో సిఎం దత్త పుత్రుడిగా ఉన్న స్టీఫెన్ అంత పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు, మళ్ళీ ప్రమాదంలో పడ్డ తోబోట్టువు (మంజు వారియర్) ని ఎలా కాపాడుకున్నాడనే పాయింట్ దర్శకుడు కం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఈ ఎల్ 2 ఎంపురన్ లో చూపించబోతున్నాడు. ఈసారి విదేశాల్లోనూ ఎక్కువ శాతం షూటింగ్ చేశారు.
విజువల్స్, కంటెంట్ చాలా భారీగా ఉన్నాయి. టోవినో థామస్ ఉన్నాడో లేదో రివీల్ చేయలేదు కానీ మొత్తానికి అంచనాలు పెంచడంలో పృథ్విరాజ్ సక్సెసయ్యాడు. స్టోరీకి సంబంధించి ఎక్కువ క్లూస్ ఇవ్వకుండా మేనేజ్ చేశారు కాబట్టి ట్రైలర్ వచ్చేదాకా ఎదురు చూడాలి.
మార్చి 27 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. గాడ్ ఫాదర్ యావరేజ్ అయ్యింది కాబట్టి దీన్ని మెగాస్టార్ రీమేక్ చేయడం జరగకపోవచ్చు. విక్రమ్ వీరధీర సూరన్ పార్ట్ 2తో పోటీ పడుతున్న ఎల్2 ఎంపురన్ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ పెద్ద బడ్జెట్ తో నిర్మించారు.
This post was last modified on January 26, 2025 7:55 pm
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…