ఒక్కో జానర్కు ఒక్కో రీచ్ ఉంటుంది. కొన్ని జానర్ల సినిమాలకు వసూళ్ల పరంగా పరిమితులు కూడా ఉంటాయి. వందల కోట్ల వసూళ్లు సాధించాలంటే అందులో టాప్ స్టార్లు నటించాలి. అది ఈవెంట్ ఫిలిం అయ్యుండాలి. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా అయ్యుండాలి అనే అభిప్రాయాలు అందరిలోనూ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఒక స్థాయికి మించి వసూళ్లు రాబట్టలేవు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంటుంది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాత్రం ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది.
విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. ఆయనకు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. కానీ 2000 అనంతరం తర్వాతి తరం స్టార్ల జోరు ముందు ఆయన నిలవలేకపోయారు. చాలా ఏళ్ల నుంచి ఆయన మిడ్ రేంజ్ సినిమాలే చేస్తున్నారు. వాటి బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు అన్నీ కూడా ఒక స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఆయన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’కు మంచి బజ్ వచ్చినా సరే.. మరీ అలవోకగా వంద, రెండొందల కోట్ల వసూళ్లను దాటేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
మూడు రోజుల్లో వంద కోట్లు.. వారం తిరిగేసరికి రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం అనూహ్యం. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ.250 కోటల మార్కును కూడా దాటేసి.. లేటెస్ట్గా రూ.260 కోట్ల దగ్గర ఉన్నాయి. 12 రోజుల్లోనే ఈ సినిమా ఈ మార్కును టచ్ చేసింది. ఇక రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది లాంఛనమే.
రూ.50 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన ఒక ఫ్యామిలీ సినిమా.. కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది చిన్న విషయం కాదు. రెండో వీకెండ్లో కూడా ఒక కొత్త చిత్రంలా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో బుక్ మై షోలో లక్షన్నరకు పైగా టికెట్లు తెగాయంటే ఈ సినిమా ఊపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 26, 2025 5:39 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…