ఒక్కో జానర్కు ఒక్కో రీచ్ ఉంటుంది. కొన్ని జానర్ల సినిమాలకు వసూళ్ల పరంగా పరిమితులు కూడా ఉంటాయి. వందల కోట్ల వసూళ్లు సాధించాలంటే అందులో టాప్ స్టార్లు నటించాలి. అది ఈవెంట్ ఫిలిం అయ్యుండాలి. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా అయ్యుండాలి అనే అభిప్రాయాలు అందరిలోనూ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఒక స్థాయికి మించి వసూళ్లు రాబట్టలేవు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంటుంది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాత్రం ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది.
విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. ఆయనకు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. కానీ 2000 అనంతరం తర్వాతి తరం స్టార్ల జోరు ముందు ఆయన నిలవలేకపోయారు. చాలా ఏళ్ల నుంచి ఆయన మిడ్ రేంజ్ సినిమాలే చేస్తున్నారు. వాటి బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు అన్నీ కూడా ఒక స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఆయన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’కు మంచి బజ్ వచ్చినా సరే.. మరీ అలవోకగా వంద, రెండొందల కోట్ల వసూళ్లను దాటేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
మూడు రోజుల్లో వంద కోట్లు.. వారం తిరిగేసరికి రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం అనూహ్యం. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ.250 కోటల మార్కును కూడా దాటేసి.. లేటెస్ట్గా రూ.260 కోట్ల దగ్గర ఉన్నాయి. 12 రోజుల్లోనే ఈ సినిమా ఈ మార్కును టచ్ చేసింది. ఇక రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది లాంఛనమే.
రూ.50 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన ఒక ఫ్యామిలీ సినిమా.. కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం అన్నది చిన్న విషయం కాదు. రెండో వీకెండ్లో కూడా ఒక కొత్త చిత్రంలా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో బుక్ మై షోలో లక్షన్నరకు పైగా టికెట్లు తెగాయంటే ఈ సినిమా ఊపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 26, 2025 5:39 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…