Movie News

చిరుకు చేసినట్లే.. బాలయ్యకు చేస్తారా?

తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది. బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడిచింది. ఏపీ ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్‌ కోసం నామినేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్యకు ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలింది.

బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి, అద్భుతమైన పాత్రలు పోషించడమే కాక.. మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాలయ్య చేస్తున్న సేవ అసామాన్యమైనది. కాబట్టి ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితమే.

ఇదిలా ఉంటే.. బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ఇండస్ట్రీ తరఫున కచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే. సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే కానీ.. పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నపుడు టాలీవుడ్ తరఫున భారీ సన్మాన వేడుక చేశారు. దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరఫున చేశారు కానీ.. అది అనుకున్నంత పెద్దగా జరగలేదు. మీడియాలో కూడా దాని గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

This post was last modified on January 26, 2025 5:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

42 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

45 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago