Movie News

చిరుకు చేసినట్లే.. బాలయ్యకు చేస్తారా?

తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది. బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడిచింది. ఏపీ ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్‌ కోసం నామినేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్యకు ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలింది.

బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి, అద్భుతమైన పాత్రలు పోషించడమే కాక.. మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాలయ్య చేస్తున్న సేవ అసామాన్యమైనది. కాబట్టి ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితమే.

ఇదిలా ఉంటే.. బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ఇండస్ట్రీ తరఫున కచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే. సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే కానీ.. పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నపుడు టాలీవుడ్ తరఫున భారీ సన్మాన వేడుక చేశారు. దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరఫున చేశారు కానీ.. అది అనుకున్నంత పెద్దగా జరగలేదు. మీడియాలో కూడా దాని గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

This post was last modified on January 26, 2025 5:34 pm

Share

Recent Posts

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

13 minutes ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

6 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

10 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

10 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

14 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

14 hours ago