తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది. బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడిచింది. ఏపీ ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్ కోసం నామినేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్యకు ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలింది.
బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి, అద్భుతమైన పాత్రలు పోషించడమే కాక.. మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్గా బాలయ్య చేస్తున్న సేవ అసామాన్యమైనది. కాబట్టి ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితమే.
ఇదిలా ఉంటే.. బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ఇండస్ట్రీ తరఫున కచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే. సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే కానీ.. పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నపుడు టాలీవుడ్ తరఫున భారీ సన్మాన వేడుక చేశారు. దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరఫున చేశారు కానీ.. అది అనుకున్నంత పెద్దగా జరగలేదు. మీడియాలో కూడా దాని గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 26, 2025 5:34 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…