వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయాన్నందుకుంది. ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో విజయాలు ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ ఊపులో ఇప్పడు అఖండ సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉంది. ఇటీవలే మహా కుంభమేళాకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచచాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
తర్వాతి షెడ్యూల్ కోసం ఆయన లొకేషన్ వేటలో ఉన్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులోకి క్రేజీ అడిషన్ యాడ్ అయింది. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి విజయాలు అందుకుని లక్కీ ఛార్మ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ అఖండ-2లో నటించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే సంయుక్త అఖండ-2లోకి రావడంతో ప్రగ్యా జైస్వాల్ను ఈ సినిమా నుంచి తీసేశారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
అఖండలో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆమె పాత్ర కూడా ఉంటుందనే అనుకున్నారు. కానీ సంయుక్త రాకతో ప్రగ్యాపై వేటు పడిందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రగ్యా కొనసాగనుంది. కొత్తగా సంయుక్త వచ్చి చేరింది. బాలయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అఖండలో మాత్రం అలా లేదు. కానీ సీక్వెల్లో మాత్రం రెండో హీరోయిన్ వచ్చి చేరింది.
బాలయ్యతో సంయుక్త నటించనుండడం ఇదే తొలిసారి. మరి అలాంటి యంగ్ హీరోయిన్కు బాలయ్య సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. మరోవైపు ప్రగ్యా బాలయ్యతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె ఇప్పటికే అఖండ, డాకు మహారాజ్ సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టింది. అఖండ-2 వీరి కలయికలో మూడో సినిమా. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 24, 2025 8:55 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…