వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయాన్నందుకుంది. ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో విజయాలు ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ ఊపులో ఇప్పడు అఖండ సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉంది. ఇటీవలే మహా కుంభమేళాకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచచాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
తర్వాతి షెడ్యూల్ కోసం ఆయన లొకేషన్ వేటలో ఉన్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులోకి క్రేజీ అడిషన్ యాడ్ అయింది. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి విజయాలు అందుకుని లక్కీ ఛార్మ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ అఖండ-2లో నటించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే సంయుక్త అఖండ-2లోకి రావడంతో ప్రగ్యా జైస్వాల్ను ఈ సినిమా నుంచి తీసేశారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
అఖండలో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆమె పాత్ర కూడా ఉంటుందనే అనుకున్నారు. కానీ సంయుక్త రాకతో ప్రగ్యాపై వేటు పడిందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రగ్యా కొనసాగనుంది. కొత్తగా సంయుక్త వచ్చి చేరింది. బాలయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అఖండలో మాత్రం అలా లేదు. కానీ సీక్వెల్లో మాత్రం రెండో హీరోయిన్ వచ్చి చేరింది.
బాలయ్యతో సంయుక్త నటించనుండడం ఇదే తొలిసారి. మరి అలాంటి యంగ్ హీరోయిన్కు బాలయ్య సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. మరోవైపు ప్రగ్యా బాలయ్యతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె ఇప్పటికే అఖండ, డాకు మహారాజ్ సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టింది. అఖండ-2 వీరి కలయికలో మూడో సినిమా. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 24, 2025 8:55 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…