వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయాన్నందుకుంది. ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో విజయాలు ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ ఊపులో ఇప్పడు అఖండ సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉంది. ఇటీవలే మహా కుంభమేళాకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచచాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
తర్వాతి షెడ్యూల్ కోసం ఆయన లొకేషన్ వేటలో ఉన్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులోకి క్రేజీ అడిషన్ యాడ్ అయింది. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి విజయాలు అందుకుని లక్కీ ఛార్మ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ అఖండ-2లో నటించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే సంయుక్త అఖండ-2లోకి రావడంతో ప్రగ్యా జైస్వాల్ను ఈ సినిమా నుంచి తీసేశారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
అఖండలో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆమె పాత్ర కూడా ఉంటుందనే అనుకున్నారు. కానీ సంయుక్త రాకతో ప్రగ్యాపై వేటు పడిందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రగ్యా కొనసాగనుంది. కొత్తగా సంయుక్త వచ్చి చేరింది. బాలయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అఖండలో మాత్రం అలా లేదు. కానీ సీక్వెల్లో మాత్రం రెండో హీరోయిన్ వచ్చి చేరింది.
బాలయ్యతో సంయుక్త నటించనుండడం ఇదే తొలిసారి. మరి అలాంటి యంగ్ హీరోయిన్కు బాలయ్య సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. మరోవైపు ప్రగ్యా బాలయ్యతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె ఇప్పటికే అఖండ, డాకు మహారాజ్ సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టింది. అఖండ-2 వీరి కలయికలో మూడో సినిమా. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 24, 2025 8:55 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…