వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయాన్నందుకుంది. ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో విజయాలు ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ ఊపులో ఇప్పడు అఖండ సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉంది. ఇటీవలే మహా కుంభమేళాకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచచాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
తర్వాతి షెడ్యూల్ కోసం ఆయన లొకేషన్ వేటలో ఉన్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులోకి క్రేజీ అడిషన్ యాడ్ అయింది. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి విజయాలు అందుకుని లక్కీ ఛార్మ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ అఖండ-2లో నటించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే సంయుక్త అఖండ-2లోకి రావడంతో ప్రగ్యా జైస్వాల్ను ఈ సినిమా నుంచి తీసేశారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
అఖండలో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆమె పాత్ర కూడా ఉంటుందనే అనుకున్నారు. కానీ సంయుక్త రాకతో ప్రగ్యాపై వేటు పడిందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ప్రగ్యా కొనసాగనుంది. కొత్తగా సంయుక్త వచ్చి చేరింది. బాలయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అఖండలో మాత్రం అలా లేదు. కానీ సీక్వెల్లో మాత్రం రెండో హీరోయిన్ వచ్చి చేరింది.
బాలయ్యతో సంయుక్త నటించనుండడం ఇదే తొలిసారి. మరి అలాంటి యంగ్ హీరోయిన్కు బాలయ్య సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. మరోవైపు ప్రగ్యా బాలయ్యతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె ఇప్పటికే అఖండ, డాకు మహారాజ్ సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టింది. అఖండ-2 వీరి కలయికలో మూడో సినిమా. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…