మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. శివరాత్రికి రావొచ్చనే అంచనాల మధ్య ఇంకో నెల రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదు. ఇటీవలే శివుడి గెటప్ లో అక్షయ్ కుమార్ లుక్ రివీల్ చేశాక డార్లింగ్ ఏ రూపంలో కనిపిస్తాడనే ఆసక్తి సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంది.
అయితే నిడివి ఎంత ఉండొచ్చనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కానీ 20 నిమిషాల నుంచి అరగంట దాకా ప్రభాస్ క్యారెక్టర్ ఉండొచ్చని అంటున్నారు. మనిషి రూపంలో తిరిగే బసవయ్యగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని అంటున్నారు.
ఇక్కడితో అయిపోలేదు. ప్రభాస్ ఇంట్రోనే ఒక పాటతో మొదలవుతుంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఇటీవలే ఒక రియాలిటీ షోలో ఆయన ఈ ముచ్చట చెప్పారు. డాన్స్ డివోషనల్ గా ఉంటుంది కానీ మరీ మాస్ ని టార్గెట్ చేసే విధంగా కాకపోవచ్చు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం శివ దర్శనం ముందు వచ్చే ఎపిసోడ్ లో ఈ సాంగ్ ఉండొచ్చని వినికిడి. యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా ప్రభాస్ కు తగినంత స్క్రీన్ స్పేస్ తో పాటు బలమైన సీన్లు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తీశారని అంటున్నారు. విష్ణు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చాలా గుట్టుగా ఉంచుతున్నాడు.
ఏప్రిల్ 25 విడుదల కాబోతున్న కన్నప్ప మార్కెటింగ్ కు ప్రభాస్ కీలకం కానున్నాడు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా భాషల్లో బిజినెస్ జరగడానికి తన ఇమేజ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే మూడు నెలల ముందే ప్రోమోలు, పోస్టర్లు వదిలితే అసలు టైంకి ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారట.
మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరులతో భారీ తారాగణం సెట్ చేసుకున్న కన్నప్ప 2025లో ప్రభాస్ నుంచి వచ్చే మొదటి సినిమా కావొచ్చు. ది రాజా సాబ్ ఏప్రిల్ 10 నుంచి తప్పుకున్న నేపథ్యంలో కన్నప్పకు డార్లింగ్ ఫ్యాన్స్ ఇచ్చే వెల్కమ్ భారీగా ఉండబోతోంది.
This post was last modified on January 23, 2025 5:24 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…