సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ వెళుతుంటారు. క్రైం జానర్ సినిమాలను తెరకెక్కించడంలో ఒకప్పుడు తనను మించిన వారు లేరని అనిపించుకున్న వర్మ… ఆ తర్వాత ఎందుకనో గానీ చతికలిబడిపోయారు. థర్డ్ గ్రేడ్ సినిమాల తరహా మూవీలు తెరకెక్కిస్తూ తనను తాను తగ్గించుకుంటున్నారు. ఇక నిత్యం వివాదాలతోనే ఆయన సావాసం చేస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తించేదే.
పోలీసులు అన్నా…చట్టాలు అన్నా…చివరకు కోర్టులు అన్నా లైట్ తీసుకుంటున్నట్లు కనిపించే వర్మకు ఇప్పుడు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏకంగా 3 నెలల జైలు శిక్ష పడింది. అది కూడా మహారాష్ట్ర రాజదాని ముంబైలోని అంధేరీ కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసులో ఏనాడూ వర్మ కోర్టుకు హాజరైన దాఖలానే లేదట.
కోర్టులను లైట్ తీసుకున్న వర్మ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంధేరీ కోర్టు… వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంతేకాకుండా విచారణకు హాజరు కాని వర్మకు 3 నెలల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని వర్మకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం చెల్లించని పక్షంలో మరో 3 నెలల పాటు జైలు జీవితం గడపాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వర్మ ఉరుకులు పరుగులు పెట్టక తప్పదు. మునుపటి మాదిరిగా ఇప్పుడూ లైట్ తీసుకుంటే మాత్రం ఆయన తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 23, 2025 2:51 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…