సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ వెళుతుంటారు. క్రైం జానర్ సినిమాలను తెరకెక్కించడంలో ఒకప్పుడు తనను మించిన వారు లేరని అనిపించుకున్న వర్మ… ఆ తర్వాత ఎందుకనో గానీ చతికలిబడిపోయారు. థర్డ్ గ్రేడ్ సినిమాల తరహా మూవీలు తెరకెక్కిస్తూ తనను తాను తగ్గించుకుంటున్నారు. ఇక నిత్యం వివాదాలతోనే ఆయన సావాసం చేస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తించేదే.
పోలీసులు అన్నా…చట్టాలు అన్నా…చివరకు కోర్టులు అన్నా లైట్ తీసుకుంటున్నట్లు కనిపించే వర్మకు ఇప్పుడు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏకంగా 3 నెలల జైలు శిక్ష పడింది. అది కూడా మహారాష్ట్ర రాజదాని ముంబైలోని అంధేరీ కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసులో ఏనాడూ వర్మ కోర్టుకు హాజరైన దాఖలానే లేదట.
కోర్టులను లైట్ తీసుకున్న వర్మ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంధేరీ కోర్టు… వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంతేకాకుండా విచారణకు హాజరు కాని వర్మకు 3 నెలల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని వర్మకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం చెల్లించని పక్షంలో మరో 3 నెలల పాటు జైలు జీవితం గడపాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వర్మ ఉరుకులు పరుగులు పెట్టక తప్పదు. మునుపటి మాదిరిగా ఇప్పుడూ లైట్ తీసుకుంటే మాత్రం ఆయన తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 23, 2025 2:51 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…