సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ వెళుతుంటారు. క్రైం జానర్ సినిమాలను తెరకెక్కించడంలో ఒకప్పుడు తనను మించిన వారు లేరని అనిపించుకున్న వర్మ… ఆ తర్వాత ఎందుకనో గానీ చతికలిబడిపోయారు. థర్డ్ గ్రేడ్ సినిమాల తరహా మూవీలు తెరకెక్కిస్తూ తనను తాను తగ్గించుకుంటున్నారు. ఇక నిత్యం వివాదాలతోనే ఆయన సావాసం చేస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తించేదే.
పోలీసులు అన్నా…చట్టాలు అన్నా…చివరకు కోర్టులు అన్నా లైట్ తీసుకుంటున్నట్లు కనిపించే వర్మకు ఇప్పుడు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏకంగా 3 నెలల జైలు శిక్ష పడింది. అది కూడా మహారాష్ట్ర రాజదాని ముంబైలోని అంధేరీ కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసులో ఏనాడూ వర్మ కోర్టుకు హాజరైన దాఖలానే లేదట.
కోర్టులను లైట్ తీసుకున్న వర్మ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంధేరీ కోర్టు… వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంతేకాకుండా విచారణకు హాజరు కాని వర్మకు 3 నెలల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని వర్మకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం చెల్లించని పక్షంలో మరో 3 నెలల పాటు జైలు జీవితం గడపాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వర్మ ఉరుకులు పరుగులు పెట్టక తప్పదు. మునుపటి మాదిరిగా ఇప్పుడూ లైట్ తీసుకుంటే మాత్రం ఆయన తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 23, 2025 2:51 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…