ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ గా అభిమానులకు అఖండ చాలా ప్రత్యేకం. అందులోనూ స్టార్ హీరోలు రిస్క్ గా భావించే అఘోరా పాత్రను బాలయ్య అద్భుతంగా పోషించిన తీరు, తమన్ ఇచ్చిన గూస్ బంప్స్ నేపధ్య సంగీతం దాని స్థాయిని పదిరెట్లు పెంచాయి.
అందుకే సీక్వెల్ కోసం రెండేళ్ల నుంచి ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు దాన్ని 2025 సెప్టెంబర్ లో నెరవేర్చబోతున్నారు. అయితే కంటెంట్ కు సంబంధించిన ఇప్పటిదాకా పెద్దగా విశేషాలు బయటికి రాలేదు.
తాజాగా అనంతపూర్ లో జరిగిన డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ కే పూర్తి డబ్బులు ఇచ్చేయొచ్చని అంత కసిగా దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్నారని, ముందే ప్రిపేర్ అయిపోమని అభిమానులకు పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.
అఖండలో కీలకంగా నిలిచింది ఇంటర్వెల్ ఎపిసోడే. వన్ అఫ్ ది బెస్ట్ టాలీవుడ్ ఇంటర్వెల్స్ గా దీని గురించి విమర్శకులు సందర్భం వచ్చినప్పుడంతా చెబుతూ ఉంటారు. అలాంటిది అఖండ 2లో అంతకు మించే ఉంటుందంటే ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని కంట్రోల్ చేయడం కష్టం.
సెప్టెంబర్ 25 విడుదల తేదీని అధికారికంగా లాక్ చేసుకున్న అఖండ 2 అనుకున్న ప్రకారమే ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉన్న బోయపాటి శీనుతో త్వరలోనే బాలయ్య జాయిన్ కాబోతున్నారు. మొదటి భాగంలో ఉన్న పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు తోడు కాబోతున్నాయి.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా ఎపిసోడ్ అఖండ 2లో ఉండబోతోంది. అఘోరాగా నటించిన పెద్ద బాలయ్య చుట్టే సీక్వెల్ జరగనుందని టాక్. చిన్న బాలయ్య కూతురికి రక్షణగా పెదనాన్న ఏం చేశాడనే దానికి బోయపాటి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చి ఉంటాడనేది ఆసక్తికరం.
This post was last modified on January 22, 2025 9:26 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…