Movie News

టికెట్ల ధరల మర్మం తెలిసిందా?

కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక.. థియేటర్లకు వెళ్లి అంతంత ఖర్చు పెట్టడం ఎందుకు, కొన్ని రోజులు ఆగి అయినా ఇంట్లో ప్రశాంతంగా సినిమా చూసుకుందాంలే అనుకునే వారు ఎక్కువయ్యారు. ఇలాంటి టైంలో ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారింది. వారికి నచ్చే సినిమా అందించడం ఒకెత్తయితే.. థియేటర్లకు రావడానికి అనువైన వాతావరణం కల్పించడం మరో ఎత్తు.

కానీ వాళ్లను ఎలా ఆకర్షించాలో చూడకుండా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి కదా అని తొలి వారం, పది రోజుల్లో అయిన కాడికి టికెట్ల ధరలు పెంచేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేస్తున్న పరిస్థితులు తలెత్తాయి. మిగతా వర్గాల ప్రేక్షకులు సైతం టికెట్ల ధరల విషయంలో వెనుకంజ వేయడం కొన్ని సినిమాల విషయంలో జరిగింది. ‘పుష్ప-2’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కచ్చితంగా అధిక టికెట్ల ధరలు ఒక కారణం అనడంలో సందేహం లేదు.

సంక్రాంతి సినిమాల్లో మొదటగా రిలీజైన ‘గేమ్ చేంజర్’కు కూడా ఎక్కువ రేట్లే పెట్టారు. అసలే టాక్ బాగా లేదు. పైగా రేట్లు ఎక్కువ. దీంతో ఈ సినిమా థియేటర్లలో కూడా జనం పలుచబడిపోయారు. కానీ సంక్రాంతి రేసులో వచ్చిన మిగతా రెండు చిత్రాలు ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు మాత్రం అంచనాలను మించి ఆడేస్తున్నాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ వసూళ్ల మోత గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేశారు. ‘డాకు మహారాజ్’కు ఏపీలో రేట్లు కొంత పెంచారు. అసలే ఫ్యామిలీ ఎమోషన్ లతో కూడిన మాస్, మూవీ, పైగా అధిక ధరలు లేవు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. టికెట్ల ధరలు అందుబాటులో ఉండి, వాళ్లు కోరుకునే సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. గత నెల పుష్ప-2 చూడాలని ఉన్నా, అధిక రేట్లకు భయపడి థియేటర్లకు వెళ్లడం మానేసిన ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య పెద్దదే.

యూత్ ఆడియన్స్‌కు సైతం ఈ సినిమా రేట్లు షాక్ కొట్టేలా చేశాయి. నార్మల్ రేట్లు ఉంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగి ఓవరాల్ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్న బేసిక్ సూత్రాన్ని నిర్మాతలు మరిచిపోతున్నారు. పుష్ప-2కు ఎక్కువ రేట్లు ఉన్నా.. అంతకంటే తక్కువ ధరలో రిలీజైన కల్కి మూవీ ఒక థియేటర్లో కలెక్ట్ చేసిన మొత్తం దాదాపు 50 శాతం ఎక్కువ అంటూ ఒక ఎగ్జిబిటర్ గత నెల విలేకరులతో చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావనార్హం.

కాబట్టి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయని అత్యాశతో అయిన కాడికి రేట్లు పెంచడం ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారనే వాస్తవాన్ని నిర్మాతలు గుర్తిస్తే మంచిది.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

4 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

5 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

5 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

5 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

6 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

8 hours ago