ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్ ఖరారైనట్టే. సరైన టైం చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత రాఘవపూడి దక్కించుకున్న బంపర్ ఆఫర్ ఇది.
ప్రభాస్ దీన్ని ఎంతగా ప్రేమించాడంటే ది రాజా సాబ్ కు ఆ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చి మరీ ఫౌజీ కోసం షెడ్యూల్స్ కేటాయించేంత. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలు అందించగా మిగిలినవి త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. ఇక్కడి దాకా అందరికి తెలిసిన విషయాలే.
అసలు ఫౌజీ ప్రపంచం ఊహకందని స్థాయిలో ఉండబోతోందని సమాచారం. స్వాతంత్రం రాకముందు జరిగే నేపథ్యంలో ప్రభాస్ ఒక బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన సైనికుడిగా కనిపిస్తాడని టాక్. తనకు హీరోయిన్ ఇమాన్వికి మధ్య జరిగే ప్రేమకథ చాలా ఫ్రెష్ గా ఇప్పటిదాకా ఏ స్టార్ హీరో సినిమాలో చూడనంత డెప్త్ గా ఉంటుందట.
అలాని హను స్టైల్ లో నెమ్మదిగా ఉండదు. కథనం పరుగులు పెడుతూనే గూస్ బంప్స్ అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా పెట్టారట. ముఖ్యంగా బ్రిటిషర్లతో చేసే ఒక యుద్ధం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవనే స్థాయిలో రానుందని ఇన్ సైడ్ న్యూస్.
ఇంకా బోలెడు విశేషాలు ఉంటాయి కానీ విడుదల దగ్గరపడే కొద్దీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. రిలీజ్ డేట్ విషయంలో మైత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవిలో రాజా సాబ్ వస్తే డిసెంబర్ లో ఫౌజీని దింపాలనేది ఒక ప్రతిపాదన. మైత్రినే నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా 2026 సంక్రాంతి ఆల్రెడీ లాక్ అయ్యింది.
ఒకవేళ అది కనక అనుకున్న టైంకి పూర్తవ్వకపోతే అప్పుడు ఫౌజీని పండక్కి వదలొచ్చు. ఎప్పుడు వచ్చినా ఫౌజీ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. ముఖ్యంగా ఒకనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఇందులో కనిపించనున్నారట.
This post was last modified on January 22, 2025 5:30 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…