ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్ ఖరారైనట్టే. సరైన టైం చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత రాఘవపూడి దక్కించుకున్న బంపర్ ఆఫర్ ఇది.
ప్రభాస్ దీన్ని ఎంతగా ప్రేమించాడంటే ది రాజా సాబ్ కు ఆ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చి మరీ ఫౌజీ కోసం షెడ్యూల్స్ కేటాయించేంత. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలు అందించగా మిగిలినవి త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. ఇక్కడి దాకా అందరికి తెలిసిన విషయాలే.
అసలు ఫౌజీ ప్రపంచం ఊహకందని స్థాయిలో ఉండబోతోందని సమాచారం. స్వాతంత్రం రాకముందు జరిగే నేపథ్యంలో ప్రభాస్ ఒక బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన సైనికుడిగా కనిపిస్తాడని టాక్. తనకు హీరోయిన్ ఇమాన్వికి మధ్య జరిగే ప్రేమకథ చాలా ఫ్రెష్ గా ఇప్పటిదాకా ఏ స్టార్ హీరో సినిమాలో చూడనంత డెప్త్ గా ఉంటుందట.
అలాని హను స్టైల్ లో నెమ్మదిగా ఉండదు. కథనం పరుగులు పెడుతూనే గూస్ బంప్స్ అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా పెట్టారట. ముఖ్యంగా బ్రిటిషర్లతో చేసే ఒక యుద్ధం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవనే స్థాయిలో రానుందని ఇన్ సైడ్ న్యూస్.
ఇంకా బోలెడు విశేషాలు ఉంటాయి కానీ విడుదల దగ్గరపడే కొద్దీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. రిలీజ్ డేట్ విషయంలో మైత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవిలో రాజా సాబ్ వస్తే డిసెంబర్ లో ఫౌజీని దింపాలనేది ఒక ప్రతిపాదన. మైత్రినే నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా 2026 సంక్రాంతి ఆల్రెడీ లాక్ అయ్యింది.
ఒకవేళ అది కనక అనుకున్న టైంకి పూర్తవ్వకపోతే అప్పుడు ఫౌజీని పండక్కి వదలొచ్చు. ఎప్పుడు వచ్చినా ఫౌజీ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. ముఖ్యంగా ఒకనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఇందులో కనిపించనున్నారట.
This post was last modified on January 22, 2025 5:30 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…