Movie News

ఐటీ రైడ్స్… పోస్టర్ల మీద చర్చ అవసరమా?

టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక నిర్మాణ సంస్థ‌కు పెద్ద సక్సెస్ వచ్చినపుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేయడం చాలాసార్లు జరిగింది. ఐతే ఇప్పుడు ఒకేసారి రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల అధినేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరగడం.. ఫైనాన్షియర్ల మీద సైతం ఐటీ అధికారులు కన్నేయడం చర్చనీయాంశంగా మారింది.

గత నెల ‘పుష్ప-2’తో భారీ విజయం అందుకున్న మైత్రీ మేకర్స్ అధినేతలు.. ఇప్పుడు సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను రిలీజ్ చేసిన దిల్ రాజు ఐటీ అధికారులకు టార్గెట్ అయ్యారు. ఈ ఐటీ రైడ్స్ సాధారణమే అని ఆయా సంస్థల వర్గాలు చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థలు తమ సినిమాలకు సంబంధించి రిలీజ్ చేసిన కలెక్షన్ల పోస్టర్ల వల్లే ఈ చిక్కులు వచ్చాయంటూ చర్చించుకుంటున్నారు.

‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మొదట్నుంచి భారీ వసూళ్ల గురించి పేర్కొంటూ వరుసగా కలెక్షన్ల పోస్టర్లు దించారు. మూడు రోజులకే 500 కోట్లు.. వారానికే వెయ్యి కోట్లు.. ఇలా కలెక్షన్ల పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ‘బాహుబలి-2’ వసూళ్లను కూడా దాటేసి ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్‌ రికార్డును ‘పుష్ప-2’ సొంతం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు మైత్రీ అధినేతలు.

మరోవైపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించి తొలి రోజు రిలీజ్ చేసిన రూ.186 కోట్ల పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ కలెక్షన్ల గురించి కూడా రోజూ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో ‘పుష్ప-2’, ‘గేమ్ చేంజర్’ పోస్టర్లు ఫేక్ అంటూ చాలా చర్చ జరిగింది సోషల్ మీడియాలో. కలెక్షన్లు మరీ పెంచి చూపించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు ఆ పోస్టర్ల వల్లే ఐటీ రైడ్స్ కూడా జరుగుతున్నాయని.. ఫ్యాన్స్‌ను సంతృప్తిపరచడం కోసం చేసే ఈ పనులు ఐటీ తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాంటిది ఏమి లేదని, సాధారణ రైడ్స్ వంటివే అని నిర్మాణ సంస్థలు తెలియజేశాయి.

This post was last modified on January 21, 2025 7:04 pm

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

15 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

15 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago