Movie News

ఐటీ రైడ్స్… పోస్టర్ల మీద చర్చ అవసరమా?

టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక నిర్మాణ సంస్థ‌కు పెద్ద సక్సెస్ వచ్చినపుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేయడం చాలాసార్లు జరిగింది. ఐతే ఇప్పుడు ఒకేసారి రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల అధినేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరగడం.. ఫైనాన్షియర్ల మీద సైతం ఐటీ అధికారులు కన్నేయడం చర్చనీయాంశంగా మారింది.

గత నెల ‘పుష్ప-2’తో భారీ విజయం అందుకున్న మైత్రీ మేకర్స్ అధినేతలు.. ఇప్పుడు సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను రిలీజ్ చేసిన దిల్ రాజు ఐటీ అధికారులకు టార్గెట్ అయ్యారు. ఈ ఐటీ రైడ్స్ సాధారణమే అని ఆయా సంస్థల వర్గాలు చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థలు తమ సినిమాలకు సంబంధించి రిలీజ్ చేసిన కలెక్షన్ల పోస్టర్ల వల్లే ఈ చిక్కులు వచ్చాయంటూ చర్చించుకుంటున్నారు.

‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మొదట్నుంచి భారీ వసూళ్ల గురించి పేర్కొంటూ వరుసగా కలెక్షన్ల పోస్టర్లు దించారు. మూడు రోజులకే 500 కోట్లు.. వారానికే వెయ్యి కోట్లు.. ఇలా కలెక్షన్ల పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ‘బాహుబలి-2’ వసూళ్లను కూడా దాటేసి ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్‌ రికార్డును ‘పుష్ప-2’ సొంతం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు మైత్రీ అధినేతలు.

మరోవైపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించి తొలి రోజు రిలీజ్ చేసిన రూ.186 కోట్ల పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ కలెక్షన్ల గురించి కూడా రోజూ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో ‘పుష్ప-2’, ‘గేమ్ చేంజర్’ పోస్టర్లు ఫేక్ అంటూ చాలా చర్చ జరిగింది సోషల్ మీడియాలో. కలెక్షన్లు మరీ పెంచి చూపించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు ఆ పోస్టర్ల వల్లే ఐటీ రైడ్స్ కూడా జరుగుతున్నాయని.. ఫ్యాన్స్‌ను సంతృప్తిపరచడం కోసం చేసే ఈ పనులు ఐటీ తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాంటిది ఏమి లేదని, సాధారణ రైడ్స్ వంటివే అని నిర్మాణ సంస్థలు తెలియజేశాయి.

This post was last modified on January 21, 2025 7:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

54 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago