టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక నిర్మాణ సంస్థకు పెద్ద సక్సెస్ వచ్చినపుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేయడం చాలాసార్లు జరిగింది. ఐతే ఇప్పుడు ఒకేసారి రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల అధినేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరగడం.. ఫైనాన్షియర్ల మీద సైతం ఐటీ అధికారులు కన్నేయడం చర్చనీయాంశంగా మారింది.
గత నెల ‘పుష్ప-2’తో భారీ విజయం అందుకున్న మైత్రీ మేకర్స్ అధినేతలు.. ఇప్పుడు సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను రిలీజ్ చేసిన దిల్ రాజు ఐటీ అధికారులకు టార్గెట్ అయ్యారు. ఈ ఐటీ రైడ్స్ సాధారణమే అని ఆయా సంస్థల వర్గాలు చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థలు తమ సినిమాలకు సంబంధించి రిలీజ్ చేసిన కలెక్షన్ల పోస్టర్ల వల్లే ఈ చిక్కులు వచ్చాయంటూ చర్చించుకుంటున్నారు.
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మొదట్నుంచి భారీ వసూళ్ల గురించి పేర్కొంటూ వరుసగా కలెక్షన్ల పోస్టర్లు దించారు. మూడు రోజులకే 500 కోట్లు.. వారానికే వెయ్యి కోట్లు.. ఇలా కలెక్షన్ల పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ‘బాహుబలి-2’ వసూళ్లను కూడా దాటేసి ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ రికార్డును ‘పుష్ప-2’ సొంతం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు మైత్రీ అధినేతలు.
మరోవైపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించి తొలి రోజు రిలీజ్ చేసిన రూ.186 కోట్ల పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ కలెక్షన్ల గురించి కూడా రోజూ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో ‘పుష్ప-2’, ‘గేమ్ చేంజర్’ పోస్టర్లు ఫేక్ అంటూ చాలా చర్చ జరిగింది సోషల్ మీడియాలో. కలెక్షన్లు మరీ పెంచి చూపించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు ఆ పోస్టర్ల వల్లే ఐటీ రైడ్స్ కూడా జరుగుతున్నాయని.. ఫ్యాన్స్ను సంతృప్తిపరచడం కోసం చేసే ఈ పనులు ఐటీ తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అలాంటిది ఏమి లేదని, సాధారణ రైడ్స్ వంటివే అని నిర్మాణ సంస్థలు తెలియజేశాయి.
This post was last modified on January 21, 2025 7:04 pm
పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ బన్నీ చేయబోయే కొత్త సినిమా గురించి పరిశ్రమ, మీడియా వర్గాల్లో…
జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం…
ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత…
వన్ మూవీ వండర్ లాగా ఎప్పుడో దశాబ్దం క్రితం బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ ఆంటోనీ పాతిక సినిమాలు…
ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీలో ఎంత ప్రతిభ ఉన్నా ఆ మధ్య రాజకీయాల వైపు వెళ్లిపోవడంతో ఇండస్ట్రీకి…