2009లో విడుదలైన ‘అవతార్’ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న ప్రపంచ సినిమా రికార్డులన్నింటినీ ఆ చిత్రం బద్దలు కొట్టేసింది. ఒక సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందో.. ఇంతమందిని థియేటర్లకు రప్పించే సత్తా సినిమాకు ఉందా అనిపించేలా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందా చిత్రం. ఈ చిత్రం సాధించిన సంచలన విజయం చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్.. దానికి మూడు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు.
వాటి రిలీజ్ డేట్లు కూడా ప్రకటించారు. ఐతే 2022లో వచ్చిన ‘అవతార్’ తొలి సీక్వెల్ ‘ది వే ఆఫ్ వాటర్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో మిశ్రమ స్పందన కనిపించింది. విజువల్గా ఫస్ట్ పార్ట్ అంత గొప్పగా లేదని.. ‘అవతార్’లో చూసిన విజువల్సే రిపీటయ్యాయని.. సినిమా బోరింగ్ అని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయినా సరే.. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల ఈ చిత్రం కూడా భారీ వసూళ్లే రాబట్టింది.
ఐతే సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ మాత్రం కామెరూన్కు చేరినట్లే ఉంది. ‘అవతార్-2’ ఫలితం గురించి మాట్లాడకుండానే.. ఆ సినిమా కంటే ‘అవతార్-3’ మెరుగ్గా ఉంటుందని, కచ్చితంగా ప్రేక్షకులను సంతృప్తి పరిచేలా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘ప్రేక్షకుల అంచనాలకు మించే ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అవతార్ సిరీస్లో గత రెండు చిత్రాల్లో చూసిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకున్నాం.
వాటి స్థానంలో సరికొత్త ఛాయిస్లతో మీ ముందుకు వస్తాను. ఇలా ధైర్యం చేసి కొన్ని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసిన వాడిని అవుతాను. రెండు భాగాల్లో లేని అద్భుతాలను మూడో పార్ట్లో చూస్తారు. మీ అంచనాలను మించిన లైవ్ యాక్షన్ ఇందులో ఉంటుంది. మరో కొత్త ప్రపంచానికి సంబంధించి భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి పాత్రల మీద ఎక్కువ దృష్టిపెడుతున్నాం’’ అని కామెరూన్ తెలిపాడు. ఫైర్ థీమ్తో రాబోతున్న ‘అవతార్-3’ ఈ ఏడాది డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 21, 2025 5:29 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…