2009లో విడుదలైన ‘అవతార్’ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న ప్రపంచ సినిమా రికార్డులన్నింటినీ ఆ చిత్రం బద్దలు కొట్టేసింది. ఒక సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందో.. ఇంతమందిని థియేటర్లకు రప్పించే సత్తా సినిమాకు ఉందా అనిపించేలా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందా చిత్రం. ఈ చిత్రం సాధించిన సంచలన విజయం చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్.. దానికి మూడు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు.
వాటి రిలీజ్ డేట్లు కూడా ప్రకటించారు. ఐతే 2022లో వచ్చిన ‘అవతార్’ తొలి సీక్వెల్ ‘ది వే ఆఫ్ వాటర్’ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో మిశ్రమ స్పందన కనిపించింది. విజువల్గా ఫస్ట్ పార్ట్ అంత గొప్పగా లేదని.. ‘అవతార్’లో చూసిన విజువల్సే రిపీటయ్యాయని.. సినిమా బోరింగ్ అని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయినా సరే.. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల ఈ చిత్రం కూడా భారీ వసూళ్లే రాబట్టింది.
ఐతే సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ మాత్రం కామెరూన్కు చేరినట్లే ఉంది. ‘అవతార్-2’ ఫలితం గురించి మాట్లాడకుండానే.. ఆ సినిమా కంటే ‘అవతార్-3’ మెరుగ్గా ఉంటుందని, కచ్చితంగా ప్రేక్షకులను సంతృప్తి పరిచేలా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘ప్రేక్షకుల అంచనాలకు మించే ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అవతార్ సిరీస్లో గత రెండు చిత్రాల్లో చూసిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకున్నాం.
వాటి స్థానంలో సరికొత్త ఛాయిస్లతో మీ ముందుకు వస్తాను. ఇలా ధైర్యం చేసి కొన్ని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసిన వాడిని అవుతాను. రెండు భాగాల్లో లేని అద్భుతాలను మూడో పార్ట్లో చూస్తారు. మీ అంచనాలను మించిన లైవ్ యాక్షన్ ఇందులో ఉంటుంది. మరో కొత్త ప్రపంచానికి సంబంధించి భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి పాత్రల మీద ఎక్కువ దృష్టిపెడుతున్నాం’’ అని కామెరూన్ తెలిపాడు. ఫైర్ థీమ్తో రాబోతున్న ‘అవతార్-3’ ఈ ఏడాది డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 21, 2025 5:29 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…