ముంబయిలో ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను భారీ లాభంతో విక్రయించారు. ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది అట్లాంటిస్’ లో ఈ అపార్ట్మెంట్ను బిగ్ బీ 2021 ఏప్రిల్లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా అదే ప్రాపర్టీని అమితాబ్ రూ. 83 కోట్లకు విక్రయించడం విశేషం. ఈ లావాదేవీ ద్వారా ఆయనకు 168 శాతం లాభం దక్కింది.
ఈ అపార్ట్మెంట్ దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 4, 5, 6 బీహెచ్కే అపార్ట్మెంట్లతో విశాలమైన ప్రాజెక్ట్లో భాగమైంది. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ 2024 ప్రారంభంలో అధికారికంగా నమోదు అయ్యింది. అంతకుముందు ఈ అపార్ట్మెంట్ను అమితాబ్ బాలీవుడ్ నటి కృతి సనన్కు అద్దెకు ఇచ్చారు.
నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని 2021 నవంబర్లో ఈ లావాదేవీ జరిగింది. అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 2023 లోనే వారు సుమారు రూ. 100 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేశారు.
ప్రధానంగా ఓషివారా, మగథానే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. 2020 నుంచి ఇప్పటివరకు బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్లో దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక లావాదేవీలతో అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపై కాకుండా పెట్టుబడుల లోకంలో కూడా తన సత్తా చాటుతున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…