ముంబయిలో ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను భారీ లాభంతో విక్రయించారు. ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది అట్లాంటిస్’ లో ఈ అపార్ట్మెంట్ను బిగ్ బీ 2021 ఏప్రిల్లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా అదే ప్రాపర్టీని అమితాబ్ రూ. 83 కోట్లకు విక్రయించడం విశేషం. ఈ లావాదేవీ ద్వారా ఆయనకు 168 శాతం లాభం దక్కింది.
ఈ అపార్ట్మెంట్ దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 4, 5, 6 బీహెచ్కే అపార్ట్మెంట్లతో విశాలమైన ప్రాజెక్ట్లో భాగమైంది. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ 2024 ప్రారంభంలో అధికారికంగా నమోదు అయ్యింది. అంతకుముందు ఈ అపార్ట్మెంట్ను అమితాబ్ బాలీవుడ్ నటి కృతి సనన్కు అద్దెకు ఇచ్చారు.
నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని 2021 నవంబర్లో ఈ లావాదేవీ జరిగింది. అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 2023 లోనే వారు సుమారు రూ. 100 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేశారు.
ప్రధానంగా ఓషివారా, మగథానే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. 2020 నుంచి ఇప్పటివరకు బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్లో దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక లావాదేవీలతో అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపై కాకుండా పెట్టుబడుల లోకంలో కూడా తన సత్తా చాటుతున్నారు.
This post was last modified on January 21, 2025 12:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…