ముంబయిలో ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను భారీ లాభంతో విక్రయించారు. ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది అట్లాంటిస్’ లో ఈ అపార్ట్మెంట్ను బిగ్ బీ 2021 ఏప్రిల్లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా అదే ప్రాపర్టీని అమితాబ్ రూ. 83 కోట్లకు విక్రయించడం విశేషం. ఈ లావాదేవీ ద్వారా ఆయనకు 168 శాతం లాభం దక్కింది.
ఈ అపార్ట్మెంట్ దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 4, 5, 6 బీహెచ్కే అపార్ట్మెంట్లతో విశాలమైన ప్రాజెక్ట్లో భాగమైంది. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ 2024 ప్రారంభంలో అధికారికంగా నమోదు అయ్యింది. అంతకుముందు ఈ అపార్ట్మెంట్ను అమితాబ్ బాలీవుడ్ నటి కృతి సనన్కు అద్దెకు ఇచ్చారు.
నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని 2021 నవంబర్లో ఈ లావాదేవీ జరిగింది. అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 2023 లోనే వారు సుమారు రూ. 100 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేశారు.
ప్రధానంగా ఓషివారా, మగథానే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. 2020 నుంచి ఇప్పటివరకు బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్లో దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక లావాదేవీలతో అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపై కాకుండా పెట్టుబడుల లోకంలో కూడా తన సత్తా చాటుతున్నారు.
This post was last modified on January 21, 2025 12:49 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…