ముంబయిలో ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను భారీ లాభంతో విక్రయించారు. ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది అట్లాంటిస్’ లో ఈ అపార్ట్మెంట్ను బిగ్ బీ 2021 ఏప్రిల్లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా అదే ప్రాపర్టీని అమితాబ్ రూ. 83 కోట్లకు విక్రయించడం విశేషం. ఈ లావాదేవీ ద్వారా ఆయనకు 168 శాతం లాభం దక్కింది.
ఈ అపార్ట్మెంట్ దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 4, 5, 6 బీహెచ్కే అపార్ట్మెంట్లతో విశాలమైన ప్రాజెక్ట్లో భాగమైంది. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ లావాదేవీ 2024 ప్రారంభంలో అధికారికంగా నమోదు అయ్యింది. అంతకుముందు ఈ అపార్ట్మెంట్ను అమితాబ్ బాలీవుడ్ నటి కృతి సనన్కు అద్దెకు ఇచ్చారు.
నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని 2021 నవంబర్లో ఈ లావాదేవీ జరిగింది. అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 2023 లోనే వారు సుమారు రూ. 100 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేశారు.
ప్రధానంగా ఓషివారా, మగథానే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. 2020 నుంచి ఇప్పటివరకు బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్లో దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక లావాదేవీలతో అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపై కాకుండా పెట్టుబడుల లోకంలో కూడా తన సత్తా చాటుతున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…