టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైైర్మన్ గా వ్యవహరిస్తున్న రాజుపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తోందన్న వార్తలు అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిళ్లలోనూ హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయనకు చెందిన కార్యాలయాలపైనా ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు.
దిల్ రాజుతో పాటుగా శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డిల ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ అధికారులు మూకుమ్మడిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు హైైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులను చేపట్టారు. ఫలితంగా నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కలకలం రేగింది. మొత్తంగా నగరంలోని 8 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఈ సంక్రాంతికి తెలుగులో ప్రధానంగా మూడు సినిమాలు రిలీజ్ కాగా… వాటిలో రెండు దిల్ రాజు నిర్మించినవే ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ వాటిలో భారీ బడ్జెట్ చిత్రం కాగా… విక్టరీ వెంకటేశ్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలను దిల్ రాజే నిర్మించారు. ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా… దిల్ రాజుకు భారీ ఎత్తున లాభాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ లాభాలతో పాటుగా ఈ సినిమాల నిర్మాణం కోసం వినియోగించిన నిధులకు కూడా రాజు సరైన లెక్కలను చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ లెక్కలు తేల్చేందుకే ఐటీ శాఖ రంగంలోకి దిగినట్లు సమాచారం.
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…