టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైైర్మన్ గా వ్యవహరిస్తున్న రాజుపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తోందన్న వార్తలు అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిళ్లలోనూ హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయనకు చెందిన కార్యాలయాలపైనా ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు.
దిల్ రాజుతో పాటుగా శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డిల ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ అధికారులు మూకుమ్మడిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు హైైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులను చేపట్టారు. ఫలితంగా నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కలకలం రేగింది. మొత్తంగా నగరంలోని 8 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఈ సంక్రాంతికి తెలుగులో ప్రధానంగా మూడు సినిమాలు రిలీజ్ కాగా… వాటిలో రెండు దిల్ రాజు నిర్మించినవే ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ వాటిలో భారీ బడ్జెట్ చిత్రం కాగా… విక్టరీ వెంకటేశ్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలను దిల్ రాజే నిర్మించారు. ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా… దిల్ రాజుకు భారీ ఎత్తున లాభాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ లాభాలతో పాటుగా ఈ సినిమాల నిర్మాణం కోసం వినియోగించిన నిధులకు కూడా రాజు సరైన లెక్కలను చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ లెక్కలు తేల్చేందుకే ఐటీ శాఖ రంగంలోకి దిగినట్లు సమాచారం.
This post was last modified on January 21, 2025 9:41 am
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…