మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు విజయం దక్కి కూడా చాలా ఏళ్లయిపోయింది. గని, గాండీవధారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా సోలో హీరోగా తన చివరి సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లవడంతో తన మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ‘మట్కా’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేవు.
పెట్టుబడిలో ఐదో వంతు కూడా థియేటర్ల నుంచి వెనక్కి తేలేకపోయిందీ చిత్రం. దీంతో వరుణ్ కొత్త ప్రాజెక్టుల మీద ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. అతను హీరోగా యువి క్రియేషన్స్ సంస్థలో మేర్లపాక గాంధీ తెరకెక్కించాల్సిన చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ యువి సంస్థ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించింది. తాజాగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు కూడా.
వరుసగా సీరియస్ సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్న వరుణ్ తేజ్.. ఈసారి కామెడీ ట్రై చేయబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల్లో చక్కటి వినోదం అందించిన మేర్లపాక గాంధీ.. అదే స్టయిల్లో వరుణ్ సినిమాను రూపొందించబోతున్నాడు. వీరి కలయికలో రానున్న సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. దీనికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో క్రిష్ కుటుంబ సంస్థ అయిన ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ కూడా భాగస్వామి కానుంది. తొలి రెండు చిత్రాలతో ప్రామిసింగ్గా కనిపించిన మేర్లపాక గాంధీ కూడా తర్వాత కృష్ణార్జున యుద్ధం, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చిత్రాలతో తీవ్రంగా నిరాశపరిచాడు. ‘కొరియన్ కనకరాజు’ ఇటు వరుణ్, అటు గాంధీ కెరీర్లకు అత్యంత కీలకంగా మారనుంది.
ఇది బాాగా ఆడితే వీళ్ల కెరీర్లు గాడిన పడతాయి. లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ‘పక్కా కమర్షియ్’, ‘కంగువా’ చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బ తిన్న యువి సంస్థకు కూడా ఈ చిత్రం విజయవంతం కావడం చాలా అవసరం.
This post was last modified on January 20, 2025 7:42 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…