తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల కావాల్సిన తన చిత్రం ‘మదగజ రాజా’ ఆశ్చర్యకరంగా ఇన్నేళ్ల తర్వాత సంక్రాంతి కానుకగా విడుదలైంది. అంత పాత సినిమాను తమిళ ప్రేక్షకులు సూపర్ హిట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా రిలీజ్ ముంగిట ప్రమోషనల్ ఈవెంట్లో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు కనిపించడం చర్చనీయాంశం అయింది.
ఐతే కొన్ని రోజుల తర్వాత కోలుకుని మామూలు మనిషి కావడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. కొంతమేర విశాల్ మీద సింపతీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందనే చర్చ కూడా జరిగింది. మొత్తానికి ఎప్పటికీ విడుదలే కాదనుకున్న సినిమాతో ఇలా హిట్ కొట్టడంతో విశాల్ పేరు కోలీవుడ్లో మార్మోగుతోంది. ఇదే సమయంలో అతనొక క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.
తమిళంలో విలక్షణ చిత్రాలతో గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్తో విశాల్ జట్టు కట్టబోతున్నాడు. గౌతమ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో, అలాగే సున్నితమైన ప్రేమకథలు రూపొందించడంలో తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. విశాల్తో గౌతమ్ సినిమా అనగానే యాక్షన్ టచ్తోనే ఉంటుందని ఆశించవచ్చు.
కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ చిత్రాలతో గౌతమ్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి ఈ చిత్రాల్లో. విశాల్ ‘డిటెక్టివ్’ సినిమా సైతం గౌతమ్ తీసే యాక్షన్ చిత్రాల తరహాలోనే ఉంటుంది. వీళ్లిద్దరి కలయికలో అదిరిపోయే యాక్షన్ మూవీ వస్తుందని ఆశించవచ్చు. గౌతమ్ ఇప్పటికీ మంచి ఫాంలోనే ఉన్నప్పటికీ.. తన నిర్మాణ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల రెగ్యులర్గా సినిమాలు తీయలేకపోతున్నాడు.
‘ధృవ నక్షత్రం’ ఎంతకీ విడుదల కాక అతను ఇబ్బంది పడుతున్నాడు. అయినా కొంచెం వీలు చేసుకుని మమ్ముట్టితో ‘డొమినిక్’ అనే థ్రిల్లర్ తీశాడు. దీని తర్వాత విశాల్తోనే తన సినిమా ఉండబోతోంది. మరి ఈ క్రేజీ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.
This post was last modified on January 20, 2025 7:31 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…