Movie News

అసలు రూపం మారిపోయిన ‘భైరవం’

ఒక రీమేక్ ఎంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్ తోనో లేదా డబ్బింగ్ ఆడియోలోనో చూసి ముందే అవగాహనకు వస్తున్న ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. అలాని ప్రతిదీ వర్కౌట్ అవ్వదని కాదు. సరైన మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మెప్పించే అవకాశం ఉంటుంది.

భైరవం వర్క్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో కనిపించబోతున్న సినిమా ఇదే. నారా రోహిత్, మంచు మనోజ్ లతో స్క్రీన్ పంచుకోవడంతో దీని మీద క్రమంగా అంచనాలు రేగడం మొదలయ్యింది.

గత ఏడాది కోలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గరుడన్ రీమేక్ ఇది. అయితే తాజాగా వచ్చిన భైరవం టీజర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మూలకథను తీసుకుని తెలుగు మాస్ ఆడియన్స్ కి తగ్గట్టు చేసిన కీలక మార్పులు బాగానే కనిపిస్తున్నాయి. ముగ్గురు ప్రాణ స్నేహితులు, వాళ్ళ మధ్య బంధాన్ని రామలక్ష్మణులు, ఆంజనేయుడులతో పోలుస్తూ తీర్చిదిద్దిన క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంది.

ఈ మధ్య బ్లాక్ బస్టర్స్ లో బాగా పండుతున్న జాతర ఎపిసోడ్ ఒకటి భైరవంలోనూ ఉంది. సాయిశ్రీనివాస్ నటనలోని కొత్త కోణంలో ఇందులోనే చూడొచ్చు. చిన్న శాంపిల్ ని టీజర్ లో చూపించారు.

నాంది, ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవంని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ ఇంకా నిర్ణయించలేదు. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ కు ఈ సినిమాతోనే పరిచయమవుతోంది. సీనియర్ నటి జయసుధ చాలా కాలం తర్వాత నాయనమ్మగా ముఖ్యమైన పాత్ర పోషించారు.

క్యాస్టింగ్ పెద్దదే ఉంది. గుడి భూములకు సంబంధించిన వివాదం ముగ్గురు స్నేహితులు, ఒక పచ్చని గ్రామం మీద ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చిందనే పాయింట్ మీద భైరవం రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా ఆనంది, దివ్య పిళ్ళై తదితరులు మిగిలిన తారాగణం.

Kumar

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

6 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

7 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

8 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

11 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

12 hours ago