‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ‘ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులరైందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి సహా ఎంతోమంది ప్రముఖులు ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. ఇంటి పనుల్లో తమ నైపుణ్యాన్ని చూపించారు.
ఐతే టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరినొకరు బాగానే నామినేట్ చేసుకుంటూ వెళ్లారు కానీ.. అల్లు అర్జున్, ప్రభాస్లను ఎవరూ టచ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభాస్ అంటే ట్విట్టర్లో లేడు, మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లోనూ అతనంత యాక్టివ్గా ఉండడు.
కానీ బన్నీ సంగతి అలా కాదు. ట్విట్టర్లో చాలా యాక్టివ్. ఇలాంటి ఛాలెంజ్లు విసిరితే బాగా రిసీవ్ చేసుకుంటాడన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయినా సరే.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అతణ్ని టచ్ చేయలేదు.
చాలా రోజుల తర్వాత చివరికి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ బన్నీతో పాటు ప్రభాస్ను ఈ ఛాలెంజ్ దిశగా నామినేట్ చేశాడు. ఐతే ప్రభాస్ అనుకున్నట్లే ఈ ఛాలెంజ్కు స్పందించలేదు. కానీ బన్నీ కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏ రాజమౌళో చిరంజీవో ఛాలెంజ్ చేసి ఉంటే బన్నీ తప్పక రెస్పాండయ్యేవాడేమో.
తనకు పెద్దగా పరిచయం లేని, ఫేమ్ లేని శోభు అనే సరికి లైట్ తీసుకున్నట్లున్నాడు. ఐతే ఇప్పుడు బన్నీకి ప్రియమైన మిత్రుడు, మంచి ఫేమ్ కూడా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. అతణ్ని నామినేట్ చేశాడు. సుక్కు నుంచి ఛాలెంజ్ తీసుకున్న దేవి.. బుధవారం ఓ చక్కటి వీడియోతో పలకరించాడు. తన మేనల్లుడు నిద్ర లేపి మరీ అలర్ట్ చేయడంతో సామగ్రి అంతా రెడీ చేసుకుని ఇంటి పనుల్లో పడ్డ దేవి.. చివర్లో ‘నాన్నకు ప్రేమతో’ పాట ప్లే అవుతుండగా తండ్రికి నివాళి అర్పించి ఈ వీడియోను ముగించాడు.
తర్వాత ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ తీసుకోమని బన్నీతో పాటు మోహన్ లాల్ తదితరులను నామినేట్ చేశాడు. మరి ఇప్పుడైనా బన్నీ స్పందించి ఇంటి పనులు చేస్తున్న వీడియో పెడతాడేమో చూడాలి.
This post was last modified on April 29, 2020 2:50 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…