‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ‘ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులరైందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి సహా ఎంతోమంది ప్రముఖులు ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. ఇంటి పనుల్లో తమ నైపుణ్యాన్ని చూపించారు.
ఐతే టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరినొకరు బాగానే నామినేట్ చేసుకుంటూ వెళ్లారు కానీ.. అల్లు అర్జున్, ప్రభాస్లను ఎవరూ టచ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభాస్ అంటే ట్విట్టర్లో లేడు, మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లోనూ అతనంత యాక్టివ్గా ఉండడు.
కానీ బన్నీ సంగతి అలా కాదు. ట్విట్టర్లో చాలా యాక్టివ్. ఇలాంటి ఛాలెంజ్లు విసిరితే బాగా రిసీవ్ చేసుకుంటాడన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయినా సరే.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అతణ్ని టచ్ చేయలేదు.
చాలా రోజుల తర్వాత చివరికి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ బన్నీతో పాటు ప్రభాస్ను ఈ ఛాలెంజ్ దిశగా నామినేట్ చేశాడు. ఐతే ప్రభాస్ అనుకున్నట్లే ఈ ఛాలెంజ్కు స్పందించలేదు. కానీ బన్నీ కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏ రాజమౌళో చిరంజీవో ఛాలెంజ్ చేసి ఉంటే బన్నీ తప్పక రెస్పాండయ్యేవాడేమో.
తనకు పెద్దగా పరిచయం లేని, ఫేమ్ లేని శోభు అనే సరికి లైట్ తీసుకున్నట్లున్నాడు. ఐతే ఇప్పుడు బన్నీకి ప్రియమైన మిత్రుడు, మంచి ఫేమ్ కూడా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. అతణ్ని నామినేట్ చేశాడు. సుక్కు నుంచి ఛాలెంజ్ తీసుకున్న దేవి.. బుధవారం ఓ చక్కటి వీడియోతో పలకరించాడు. తన మేనల్లుడు నిద్ర లేపి మరీ అలర్ట్ చేయడంతో సామగ్రి అంతా రెడీ చేసుకుని ఇంటి పనుల్లో పడ్డ దేవి.. చివర్లో ‘నాన్నకు ప్రేమతో’ పాట ప్లే అవుతుండగా తండ్రికి నివాళి అర్పించి ఈ వీడియోను ముగించాడు.
తర్వాత ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ తీసుకోమని బన్నీతో పాటు మోహన్ లాల్ తదితరులను నామినేట్ చేశాడు. మరి ఇప్పుడైనా బన్నీ స్పందించి ఇంటి పనులు చేస్తున్న వీడియో పెడతాడేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…