‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ‘ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులరైందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి సహా ఎంతోమంది ప్రముఖులు ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. ఇంటి పనుల్లో తమ నైపుణ్యాన్ని చూపించారు.
ఐతే టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరినొకరు బాగానే నామినేట్ చేసుకుంటూ వెళ్లారు కానీ.. అల్లు అర్జున్, ప్రభాస్లను ఎవరూ టచ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభాస్ అంటే ట్విట్టర్లో లేడు, మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లోనూ అతనంత యాక్టివ్గా ఉండడు.
కానీ బన్నీ సంగతి అలా కాదు. ట్విట్టర్లో చాలా యాక్టివ్. ఇలాంటి ఛాలెంజ్లు విసిరితే బాగా రిసీవ్ చేసుకుంటాడన్న అభిప్రాయం జనాల్లో ఉంది. అయినా సరే.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అతణ్ని టచ్ చేయలేదు.
చాలా రోజుల తర్వాత చివరికి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ బన్నీతో పాటు ప్రభాస్ను ఈ ఛాలెంజ్ దిశగా నామినేట్ చేశాడు. ఐతే ప్రభాస్ అనుకున్నట్లే ఈ ఛాలెంజ్కు స్పందించలేదు. కానీ బన్నీ కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏ రాజమౌళో చిరంజీవో ఛాలెంజ్ చేసి ఉంటే బన్నీ తప్పక రెస్పాండయ్యేవాడేమో.
తనకు పెద్దగా పరిచయం లేని, ఫేమ్ లేని శోభు అనే సరికి లైట్ తీసుకున్నట్లున్నాడు. ఐతే ఇప్పుడు బన్నీకి ప్రియమైన మిత్రుడు, మంచి ఫేమ్ కూడా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. అతణ్ని నామినేట్ చేశాడు. సుక్కు నుంచి ఛాలెంజ్ తీసుకున్న దేవి.. బుధవారం ఓ చక్కటి వీడియోతో పలకరించాడు. తన మేనల్లుడు నిద్ర లేపి మరీ అలర్ట్ చేయడంతో సామగ్రి అంతా రెడీ చేసుకుని ఇంటి పనుల్లో పడ్డ దేవి.. చివర్లో ‘నాన్నకు ప్రేమతో’ పాట ప్లే అవుతుండగా తండ్రికి నివాళి అర్పించి ఈ వీడియోను ముగించాడు.
తర్వాత ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ తీసుకోమని బన్నీతో పాటు మోహన్ లాల్ తదితరులను నామినేట్ చేశాడు. మరి ఇప్పుడైనా బన్నీ స్పందించి ఇంటి పనులు చేస్తున్న వీడియో పెడతాడేమో చూడాలి.
This post was last modified on April 29, 2020 2:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…