ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా వెంకటేష్ దే అయిపోయింది. ఇంకో వారం పది రోజులు వీటి ఫీడింగ్ తోనే థియేటర్లు గడిచిపోయేలా ఉన్నాయి. తిరిగి మళ్ళీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న రసవత్తరమైన పోటీ నెలకొనబోతోంది. అంతకు ముందు వారమే తండేల్, పట్టుదల ఉన్నాయి కానీ వాటిలో ఒకటి వాయిదా పడొచ్చనే ప్రచారం బలంగా తిరుగుతోంది. ఇక వాలెంటైన్ డేకి క్లాష్ అవుతున్నవి మరీ పెద్ద రేంజ్ వి కాకపోయినా కంటెంట్ మీద ఆధారపడి ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
విశ్వక్ సేన్ మొదటిసారి పూర్తి స్థాయి లేడీ గెటప్ వేసిన ‘లైలా’ మీద టీజర్ వచ్చాక మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. కంటెంట్ ని సరిగా కనెక్ట్ చేయలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ తో వాటిని సరిచేస్తే మంచి బజ్ తీసుకురావచ్చు. ఊహించని విధంగా క తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి ‘దిల్ రుబా’తో పలకరిస్తున్నాడు. పైకి లవ్ స్టోరీలా కనిపిస్తోంది కానీ యాక్షన్ టచ్ కూడా ఉందని గ్లిమ్ప్స్ లో అర్థమైపోయింది. బ్రహ్మానందం, అబ్బాయి గౌతమ్ కలిసి తాత మనవడిగా నటించిన ‘బ్రహ్మ ఆనందం’ పూర్తిగా కామెడీని నమ్ముకుని దిగుతోంది. మేకర్స్ ఫలితం పట్ల ధీమాగా ఉన్నారు.
బలగంతో దర్శకుడిగా విజయం అందుకున్న కమెడియన్ వేణు యెల్దండి రూటుని అనుసరిస్తూ ధన్ రాజ్ డైరెక్ట్ చేసిన ‘రామం రాఘవం’ అదే రోజు రాబోతోంది. సముతిరఖనితో కలిసి స్క్రీన్ పంచుకున్న ధనరాజ్ చాలా ఎమోషనల్ స్టోరీ చేబుతాడట. ఈ నాలుగు సినిమాలు ఫిబ్రవరి 14న థియేటర్లలో ఉంటాయి. తండేల్ కోసం గ్యాప్ తీసుకోవాలనుకోవడం వల్ల క్లాష్ తప్పడం లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాలీవుడ్ మూవీ ‘చావా’ అదే రోజు రానుంది. చారిత్రాత్మక నేపథ్యం, హీరోయిన్ రష్మిక మందన్న లాంటి అంశాల వల్ల ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. మరి వీటిలో విజేతగా ఎవరు నిలుస్తారో ఇంకో నెలలో తేలనుంది.
This post was last modified on January 18, 2025 9:20 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…