దిల్‍ రాజు కొత్త పన్నాగం!

సీనియర్‍ ప్రొడ్యూసర్‍ దిల్‍ రాజుకి ఇటీవల స్టార్‍ హీరోల డేట్లు దొరకడం లేదు. మహేష్‍తో ప్లాన్‍ చేసిన వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే కాన్సిల్‍ అయిపోయింది. ప్రభాస్‍ డేట్స్ సాధించడం కోసం చేసిన ప్రయత్నం విఫలమయింది. రామ్‍ చరణ్‍, అల్లు అర్జున్‍ ఇద్దరి డేట్లు దిల్‍ రాజుకి ఇప్పట్లో అందుబాటులో లేవు. దీంతో వయా దర్శకుల ద్వారా పెద్ద సినిమాలు సెట్‍ చేయాలని దిల్‍ రాజు ట్రై చేస్తున్నాడు.

కానీ అగ్ర దర్శకులు కూడా ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. దాంతో ప్రస్తుతం ఫెయిల్యూర్‍లో వుండి, త్వరలో హిట్‍ ఇవ్వగలరు అనే నమ్మకం వున్న దర్శకులను దిల్‍ రాజు లైన్లో పెడుతున్నాడు. ఉదాహరణకు బోయపాటి శ్రీను ఈమధ్య హిట్‍ ఇవ్వలేదు. కానీ అతని తదుపరి చిత్రం బాలకృష్ణతో కనుక అది ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం మీద బోయపాటి శ్రీనుతో తదుపరి చిత్రాన్ని దిల్‍ రాజు ఖాయం చేసుకున్నాడు. ఆ సినిమా హిట్టయితే బోయపాటి శ్రీనుకి మళ్లీ డిమాండ్‍ పెరుగుతుంది కనుక, అతనితో పని చేద్దామనే హీరో వచ్చి తన బ్యానర్లో సినిమా చేస్తాడనేది దిల్‍ రాజు వ్యూహం.

ఇది తెలివైన పన్నాగమే కానీ ఎంతవరకు వర్కవుట్‍ అవుతుందనేది హీరో దొరికితేనే కానీ తెలీదు. దర్శకులకు, హీరోలకు అడ్వాన్సులిచ్చి బుక్‍ చేసి పెట్టుకోవడం నిర్మాతలు అందరూ చేసేదే కనుక ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్‍ అవ్వకపోయినా దిల్‍ రాజుకి పెద్ద నష్టమేం వుండదు.