సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మరో మెట్టు ఎక్కుతాడనుకున్న దేవిశ్రీ ప్రసాద్ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు.
సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లంతా అందులోని శబ్ద కాలుష్యానికి తట్టుకోలేక తలలు పట్టుకున్నారు. సినిమాలో పాత్రలన్నీ అదే పనిగా అరుస్తూ ఉంటే.. నేపథ్య సంగీతం సైతం మరీ లౌడ్గా ఉండడం ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి రిలీజ్ టైంలో బాగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్గా పని చేసిన ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ రసూల్ పొకుట్టి సైతం పరోక్షంగా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద అసహనం వ్యక్తం చేశాడు.
ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విమర్శలపై తాజాగా దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ.. కంగువా సినిమాకు తన వర్క్ విషయంలో ఎక్కువగా ప్రశంసలే వచ్చాయని, విమర్శలు చేసిన వాళ్లు తక్కువ అని దేవి పేర్కొన్నాడు.
”నేను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. మనం ఏది చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు. కంగువా ఆల్బం నాకు చాలా స్పెషల్. అందులో మన్నిప్పు పాటకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట మాట్లాడారు.
ప్రతి సినిమాలోనూ మంచి చెడులు ఉంటాయి. కంగువ సినిమా కోసం టీం ఎంత కష్టపడిందో దాని విజువల్స్ చూసినా, సూర్య నటనను పరిశీలించినా అర్థమవుతుంది. మేమందరం ఎంతో కష్టపడి, ఎంజాయ్ చేస్తూ పని చేసిన సినిమా అది. కొందరికి ఈ సినిమా నచ్చకపోయినా.. మేం మాత్రం కంగువా విషయంలో గర్వపడుతున్నాం” అని దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేశాడు.
This post was last modified on January 17, 2025 6:20 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…