సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మరో మెట్టు ఎక్కుతాడనుకున్న దేవిశ్రీ ప్రసాద్ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు.
సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లంతా అందులోని శబ్ద కాలుష్యానికి తట్టుకోలేక తలలు పట్టుకున్నారు. సినిమాలో పాత్రలన్నీ అదే పనిగా అరుస్తూ ఉంటే.. నేపథ్య సంగీతం సైతం మరీ లౌడ్గా ఉండడం ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి రిలీజ్ టైంలో బాగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్గా పని చేసిన ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్ రసూల్ పొకుట్టి సైతం పరోక్షంగా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద అసహనం వ్యక్తం చేశాడు.
ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విమర్శలపై తాజాగా దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ.. కంగువా సినిమాకు తన వర్క్ విషయంలో ఎక్కువగా ప్రశంసలే వచ్చాయని, విమర్శలు చేసిన వాళ్లు తక్కువ అని దేవి పేర్కొన్నాడు.
”నేను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. మనం ఏది చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు. కంగువా ఆల్బం నాకు చాలా స్పెషల్. అందులో మన్నిప్పు పాటకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట మాట్లాడారు.
ప్రతి సినిమాలోనూ మంచి చెడులు ఉంటాయి. కంగువ సినిమా కోసం టీం ఎంత కష్టపడిందో దాని విజువల్స్ చూసినా, సూర్య నటనను పరిశీలించినా అర్థమవుతుంది. మేమందరం ఎంతో కష్టపడి, ఎంజాయ్ చేస్తూ పని చేసిన సినిమా అది. కొందరికి ఈ సినిమా నచ్చకపోయినా.. మేం మాత్రం కంగువా విషయంలో గర్వపడుతున్నాం” అని దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…