పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ సినిమా బద్దలు కొట్టేసింది. ఓవరాల్గా కూడా ‘బాహుబలి’ రికార్డులకు ఎసరు పెట్టింది. విడుదలై 40 రోజులకు పైగా దాటినా సరే.. హిందీలో ఈ సినిమా ఇప్పటికీ చెప్పుకోదగ్గ షేర్తో సాగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టగా.. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.
ఇంకొన్ని చోట్ల స్వల్ప నష్టాలు రావచ్చు. ఓవరాల్గా బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ‘పుష్ప-2’ మెగా సక్సెస్ అనే చెప్పాలి. కానీ ఈ చిత్రం ఒక్క ఏరియాలో మాత్రం డిజాస్టర్ కావడం పెద్ద షాక్. అల్లు అర్జున్ తాను దత్త పుత్రుడినని, ఇది నా ల్యాండ్ అని చెప్పుకున్న కేరళలో ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఓపెనింగ్స్ దగ్గరే వీక్ అయిన ఈ సినిమా ఆ తర్వాత కూడా ఏ దశలోనూ పుంజుకోలేదు. ఫుల్ రన్లో పది కోట్లకు మించి వసూళ్లు సాధించలేకపోయింది.
బ్రేక్ ఈవెన్ మార్కులో మూడో వంతు మాత్రమే వసూళ్లు రాబట్టిన ‘పుష్ప-2’ డిజాస్టర్ అని తేలిపోయింది. హిందీలో ఇరగాడేస్తున్న తన చిత్రం కేరళలో ఇలా చతికిలబడడం అల్లు అర్జున్కు మింగుడు పడకపోవచ్చు. సినిమా మరీ మాస్గా ఉందని, వయొలెన్స్ ఎక్కువ ఉందని.. సున్నితమైన చిత్రాలను ఇష్టపడే మలయాళీలకు ఈ సినిమా మింగుడు పడలేదని చెప్పుకోవచ్చు. కానీ పుష్ప-2 తర్వాత వచ్చిన మోస్ట్ వయొలెంట్ యాక్షన్ మూవీ ‘మార్కో’ అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది.
అందులో హింస మోతాదు చాలా ఎక్కువ. అది మాస్ మూవీనే. అంత భయానకమైన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు.. పుష్ప-2లోని మాస్, వయొలెన్స్ పెద్ద విషయం కాదు. ఓవైపు ‘పీలింగ్స్’ పాటేమో అక్కడి జనాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఆ పాట మార్మోగుతోంది. కానీ సినిమా మాత్రం ఆదరణకు నోచుకోలేదు.
మొత్తానికి ప్రపంచమంతా అదిరిపోయే సక్సెస్ సాధించినప్పటికీ.. బన్నీకి బలమైన మార్కెట్ ఉందనుకున్న కేరళలో మాత్రం ‘పుష్ప-2’ ఆడకపోవడం పెద్ద మిస్టరీ అనే చెప్పాలి.
This post was last modified on January 17, 2025 3:41 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…