మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. దాని తోడు ఓటిటిల్లో తెలుగుతో సహా ప్రధాన భాషల్లో డబ్బింగులు పెడుతుండటంతో సబ్ టైటిల్స్ యాతన నుంచి ఆడియన్స్ తప్పించుకుంటున్నారు.
కిష్కింద కాండం, సూక్ష్మదర్శిని ఆ రకంగానే వర్కౌటయ్యాయి. గత నెల జోజు జార్జ్ ‘పని’ రిలీజయ్యింది. ఇక్కడ కూడా అనువదించి థియేటర్ విడుదల చేశారు కానీ పుష్ప 2 హడావిడిలో మనోళ్లు అస్సలు పట్టించుకోలేదు. తాజాగా ఓటిటిలో వచ్చేసింది.
వైష్ణవ్ తేజ్ ఆదికేశవతో విలన్ గా పరిచయమైనా మల్లువుడ్ నటుడు జోజు జార్జ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ ఇది. కథేంటంటే లోకల్ గా పలుకుబడి ఉన్న గిరి (జోజు జార్జ్) భార్య గౌరీ (అభినయ)ని ఒక సూపర్ మార్కెట్ లో ఇద్దరు రౌడీ కుర్రాళ్ళు ఆటపట్టిస్తారు.
గిరి వాళ్లకు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఆ సైకోలు ఓ రాత్రి గౌరీ మీద మానభంగం చేసి పారిపోతారు. వాళ్ళను వెతికే పనిలో పడ్డ గిరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా దారుణంగా హత్యకు గురవుతారు. చివరికి గిరినే ఆ ఇద్దరిని పట్టుకుని అత్యంత క్రూరంగా చంపేయడంతో ఆ ఫ్యామిలీ చల్లబడుతుంది.
ఒకరకంగా చెప్పాలంటే పని రెగ్యులర్ రివెంజ్ డ్రామానే. కాకపోతే స్క్రీన్ ప్లే కొంత ఆసక్తికరంగా ఉండటంతో తర్వాత ఏం జరుగుతుందాని ఆసక్తి కలిగించడంలో జోజు జార్జ్ కొంత మేర సక్సెసయ్యాడు. బీజీఎమ్, కెమెరా వర్క్ ఇక్కడ ఉపయోగపడ్డాయి. కాకపోతే అంత పెద్ద బిల్డప్ ఇచ్చిన గిరి బ్యాచ్ మరీ అన్యాయంగా చచ్చిపోవడం జీర్ణం కాదు.
అభినయని మానభంగం చేసే ఎపిసోడ్ చూపించిన విధానం మీద కేరళలో అభ్యంతరాలు వచ్చాయి. తర్వాత కొంత ఎడిట్ చేశారు. మొత్తానికి అసలేం పని లేకపోతే, క్రైమ్ థ్రిల్లర్ల మీద విపరీతమైన పిచ్చి ఉంటే పనికొచ్చే క్రైమ్ మూవీగా పని ఉంది.
This post was last modified on January 17, 2025 3:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…