మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. దాని తోడు ఓటిటిల్లో తెలుగుతో సహా ప్రధాన భాషల్లో డబ్బింగులు పెడుతుండటంతో సబ్ టైటిల్స్ యాతన నుంచి ఆడియన్స్ తప్పించుకుంటున్నారు.
కిష్కింద కాండం, సూక్ష్మదర్శిని ఆ రకంగానే వర్కౌటయ్యాయి. గత నెల జోజు జార్జ్ ‘పని’ రిలీజయ్యింది. ఇక్కడ కూడా అనువదించి థియేటర్ విడుదల చేశారు కానీ పుష్ప 2 హడావిడిలో మనోళ్లు అస్సలు పట్టించుకోలేదు. తాజాగా ఓటిటిలో వచ్చేసింది.
వైష్ణవ్ తేజ్ ఆదికేశవతో విలన్ గా పరిచయమైనా మల్లువుడ్ నటుడు జోజు జార్జ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ ఇది. కథేంటంటే లోకల్ గా పలుకుబడి ఉన్న గిరి (జోజు జార్జ్) భార్య గౌరీ (అభినయ)ని ఒక సూపర్ మార్కెట్ లో ఇద్దరు రౌడీ కుర్రాళ్ళు ఆటపట్టిస్తారు.
గిరి వాళ్లకు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఆ సైకోలు ఓ రాత్రి గౌరీ మీద మానభంగం చేసి పారిపోతారు. వాళ్ళను వెతికే పనిలో పడ్డ గిరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా దారుణంగా హత్యకు గురవుతారు. చివరికి గిరినే ఆ ఇద్దరిని పట్టుకుని అత్యంత క్రూరంగా చంపేయడంతో ఆ ఫ్యామిలీ చల్లబడుతుంది.
ఒకరకంగా చెప్పాలంటే పని రెగ్యులర్ రివెంజ్ డ్రామానే. కాకపోతే స్క్రీన్ ప్లే కొంత ఆసక్తికరంగా ఉండటంతో తర్వాత ఏం జరుగుతుందాని ఆసక్తి కలిగించడంలో జోజు జార్జ్ కొంత మేర సక్సెసయ్యాడు. బీజీఎమ్, కెమెరా వర్క్ ఇక్కడ ఉపయోగపడ్డాయి. కాకపోతే అంత పెద్ద బిల్డప్ ఇచ్చిన గిరి బ్యాచ్ మరీ అన్యాయంగా చచ్చిపోవడం జీర్ణం కాదు.
అభినయని మానభంగం చేసే ఎపిసోడ్ చూపించిన విధానం మీద కేరళలో అభ్యంతరాలు వచ్చాయి. తర్వాత కొంత ఎడిట్ చేశారు. మొత్తానికి అసలేం పని లేకపోతే, క్రైమ్ థ్రిల్లర్ల మీద విపరీతమైన పిచ్చి ఉంటే పనికొచ్చే క్రైమ్ మూవీగా పని ఉంది.
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…