హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను మహాకుంభమేళాకు వెళ్లి కోట్లాది మధ్య జనసందోహం మధ్య షూటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఈ అద్భుత ఉత్సవానికి సగటున రోజు యాభై లక్షలకు పైనే భక్తులు హాజరవుతున్నారు.
అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవతా మూర్తుల ఊరేగింపులు, భక్తుల ఆనంద పారవశ్యాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళాకు మొత్తం దేశ జనాభాలో పాతిక శాతానికి పైగా పాల్గొంటారని ఒక అంచనా.
అలాంటి చోట చిత్రీకరణ అంటే పెద్ద సవాలే. అయితే బోయపాటి బాలకృష్ణను తీసుకెళ్లి చేయలేదు. ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన ఫుటేజ్ తీసుకోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు షూట్ చేశారని తెలిసింది. మళ్ళీ ఇంకోసారి వెళ్లే అవకాశం ఉంది.
అఖండ 2 కథ మొత్తం పెద్ద బాలయ్య చుట్టే తిరగనుంది. లోక వినాశనానికి పూనుకున్న దుష్టశక్తులను అంతమొందించేందుకు అపారమైన దివ్య శక్తులను ప్రోగు చేసుకునే క్రమంలో చాలా కీలకమైన ఎపిసోడ్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. తెరమీద చూస్తే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో దీని తాలూకు సీన్లు ఉంటాయని తెలిసింది.
సెప్టెంబర్ లో విడుదల ఫిక్స్ చేసుకున్న అఖండ 2 ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైంకి రిలీజ్ చేసేలా బోయపాటి శీను పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. డాకు మహారాజ్ రిలీజైపోయింది కాబట్టి బాలకృష్ణ పూర్తి డేట్లు దీనికే కేటాయించబోతున్నారు.
సింహా, లెజెండ్, అఖండలతో ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయాలు అందుకున్న హీరో దర్శకుడి కాంబోగా ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద మాములు అంచనాలు లేవు. తమన్ అయిదోసారి బాలయ్యకు ఛార్ట్ బస్టర్ బీజీఎమ్, పాటలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రగ్య జైస్వాల్ తో పాటు మొదటి భాగం తారాగణం ఇందులో భాగం కానుంది.
This post was last modified on January 16, 2025 9:19 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…