బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి ఒక్కరే కారణమని, అతను ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తి కావచ్చని, ఎవరో తెలిసిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దాడి చేసిన వ్యక్తి ఎవ్వరికీ చిక్కకుండా జారుకున్నాడు అంటే అతనికి ముందు నుంచే సైఫ్ ఇంటి గురించి తెలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా సైఫ్ కుమారుడు తైమూర్ రూమ్ వద్దకి ఎందుకు వెళ్లారు అనేది మరో ప్రశ్న?. అప్పుడే ఆగంతకుడిని అడ్డుకున్న సైఫ్తో జరిగిన పెనుగులాట సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది.
దాడి అనంతరం అంత ఈజీగా దుండగుడు ఎలా పారిపోతాడు అనేది మరొక మిస్టరీగా మారింది. వేలాది కోట్ల ఆస్తిపరుడైన సైఫ్ కు సెక్యూరిటీ కూడా బలంగానే ఉంటుంది. ఇక అలాంటిది అంత తేలిగ్గా అతను ఎలా బయటపడ్డాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దుండగుడు కత్తితో దాడి చేశాడని నిర్ధారించారు.
అయితే, దాడికి ముందు ఎవరు సొసైటీకి వచ్చిన రికార్డులు లేవు, దాంతో దుండగుడు అప్పటికే సొసైటీ లోపలే ఉన్నాడన్న అనుమానం ఉద్భవించింది. గార్డులు ఎవరినీ అనుమానాస్పదంగా చూడలేదని చెప్పడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ప్రస్తుతం సైఫ్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ కుటుంబం విషయానికి వస్తే, ఘటన సమయంలో ఆయన భార్య కరీనా కపూర్, కుమారుడు తైమూర్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని ధృవీకరించారు.
సైఫ్ మెడ, వెన్నుపక్కన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే శస్త్రచికిత్స ఒకటి పూర్తి కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’లో రావణాసురుడిగా, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లో భైరవ పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఘటనపై ఎన్టీఆర్, చిరంజీవి కూడా స్పందించారు.
This post was last modified on January 16, 2025 4:00 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…