బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి ఒక్కరే కారణమని, అతను ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తి కావచ్చని, ఎవరో తెలిసిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దాడి చేసిన వ్యక్తి ఎవ్వరికీ చిక్కకుండా జారుకున్నాడు అంటే అతనికి ముందు నుంచే సైఫ్ ఇంటి గురించి తెలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా సైఫ్ కుమారుడు తైమూర్ రూమ్ వద్దకి ఎందుకు వెళ్లారు అనేది మరో ప్రశ్న?. అప్పుడే ఆగంతకుడిని అడ్డుకున్న సైఫ్తో జరిగిన పెనుగులాట సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది.
దాడి అనంతరం అంత ఈజీగా దుండగుడు ఎలా పారిపోతాడు అనేది మరొక మిస్టరీగా మారింది. వేలాది కోట్ల ఆస్తిపరుడైన సైఫ్ కు సెక్యూరిటీ కూడా బలంగానే ఉంటుంది. ఇక అలాంటిది అంత తేలిగ్గా అతను ఎలా బయటపడ్డాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దుండగుడు కత్తితో దాడి చేశాడని నిర్ధారించారు.
అయితే, దాడికి ముందు ఎవరు సొసైటీకి వచ్చిన రికార్డులు లేవు, దాంతో దుండగుడు అప్పటికే సొసైటీ లోపలే ఉన్నాడన్న అనుమానం ఉద్భవించింది. గార్డులు ఎవరినీ అనుమానాస్పదంగా చూడలేదని చెప్పడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ప్రస్తుతం సైఫ్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ కుటుంబం విషయానికి వస్తే, ఘటన సమయంలో ఆయన భార్య కరీనా కపూర్, కుమారుడు తైమూర్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని ధృవీకరించారు.
సైఫ్ మెడ, వెన్నుపక్కన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే శస్త్రచికిత్స ఒకటి పూర్తి కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’లో రావణాసురుడిగా, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లో భైరవ పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఘటనపై ఎన్టీఆర్, చిరంజీవి కూడా స్పందించారు.
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…