Movie News

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. తెలిసిన వ్యక్తే..?

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి ఒక్కరే కారణమని, అతను ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తి కావచ్చని, ఎవరో తెలిసిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

దాడి చేసిన వ్యక్తి ఎవ్వరికీ చిక్కకుండా జారుకున్నాడు అంటే అతనికి ముందు నుంచే సైఫ్ ఇంటి గురించి తెలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా సైఫ్ కుమారుడు తైమూర్ రూమ్‌ వద్దకి ఎందుకు వెళ్లారు అనేది మరో ప్రశ్న?. అప్పుడే ఆగంతకుడిని అడ్డుకున్న సైఫ్‌తో జరిగిన పెనుగులాట సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది.

దాడి అనంతరం అంత ఈజీగా దుండగుడు ఎలా పారిపోతాడు అనేది మరొక మిస్టరీగా మారింది. వేలాది కోట్ల ఆస్తిపరుడైన సైఫ్ కు సెక్యూరిటీ కూడా బలంగానే ఉంటుంది. ఇక అలాంటిది అంత తేలిగ్గా అతను ఎలా బయటపడ్డాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దుండగుడు కత్తితో దాడి చేశాడని నిర్ధారించారు.

అయితే, దాడికి ముందు ఎవరు సొసైటీకి వచ్చిన రికార్డులు లేవు, దాంతో దుండగుడు అప్పటికే సొసైటీ లోపలే ఉన్నాడన్న అనుమానం ఉద్భవించింది. గార్డులు ఎవరినీ అనుమానాస్పదంగా చూడలేదని చెప్పడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ప్రస్తుతం సైఫ్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ కుటుంబం విషయానికి వస్తే, ఘటన సమయంలో ఆయన భార్య కరీనా కపూర్, కుమారుడు తైమూర్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని ధృవీకరించారు.

సైఫ్ మెడ, వెన్నుపక్కన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే శస్త్రచికిత్స ఒకటి పూర్తి కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్‌’లో రావణాసురుడిగా, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లో భైరవ పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఘటనపై ఎన్టీఆర్, చిరంజీవి కూడా స్పందించారు.

This post was last modified on January 16, 2025 4:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago