బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉండే సందడే వేరు. ముఖ్యంగా నార్త్ ఇండియా అంతటా బాక్సాఫీస్ షేకైపోతుంది. టాక్తో సంబంధం లేకుండా సల్మాన్ సినిమాలు భారీ వసూళ్లు రాబడతాయి. ప్రతి సంవత్సరం రంజాన్ రోజు సల్మాన్ తన సినిమాను రెడీగా ఉంచుతాడు. ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది ఈద్ కోసం కూడా ఒక సినిమాను పట్టాలెక్కించాడు గత ఏడాది.
ముందు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. దీంతో తనతో వాంటెడ్, దబంగ్-3 సినిమాలు తీసిన ప్రభుదేవా డైరెక్షన్లో వెంటనే ‘రాధె’ చిత్రాన్ని ప్రకటించాడు. అంతా అనుకున్న ప్రకారం జరిగితే మేలో రంజాన్ కానుకగా ఆ సినిమా రావాల్సింది. కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది.
కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న సల్మాన్.. మళ్లీ పరిస్థితులు చక్కబడగానే షూటింగ్కు వెళ్లిపోయాడు. చాలా తక్కువ రోజుల్లోనే శరవేగంగా ‘రాధె’ సినిమాను పూర్తి చేసేశాడు. షూటింగ్ పూర్తయినట్లు ఒక వీడియోను కూడా అతను షేర్ చేశాడు. సల్మాన్ ఇంత వేగంగా సినిమాను ఫినిష్ చేసేస్తాడని అభిమానులు ఊహించలేదు. థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడవడం మొదలవగానే, సాధ్యమైంత త్వరగా ‘రాధె’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని భావిస్తున్నారు.
ఆల్రెడీ సూర్యవంశీ, 83 లాంటి భారీ చిత్రాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు వాటికి ‘రాధె’ కూడా తోడవుతున్నట్లే. కరోనా ధాటికి నైరాశ్యంలో కూరుకుపోయిన బాలీవుడ్లో మళ్లీ ఉత్సాహం నిండాలంటే సల్మాన్ సినిమా రావాల్సిందే. ‘రాధె’లో సల్మాన్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో దిశా పఠాని కథానాయిక.
This post was last modified on October 15, 2020 6:22 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…