ఆరు పదుల వయసు దాటిన హీరోలు వేగంగా సినిమాలు చేయడం సులభం కాదు. ఒకవేళ అనుకున్నా వరసగా విజయాలు సాధించడం జరగని పని. చిరంజీవికి వాల్తేరు వీరయ్య ఇచ్చిన ఆనందం భోళా శంకర్ ఆవిరి చేసింది. రజనీకాంత్ కు జైలర్ సంతోషం లాల్ సలాంతో పోయింది.
నా సామిరంగకు ముందు నాగార్జున, సంక్రాంతికి వస్తున్నాంకు ముందు వెంకటేష్ ఎలాంటి ఫలితాలు చూశారో తెలిసిందే. విక్రమ్ తో కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2తో అవమానం పాలయ్యారు. దాదాపు అందరిదీ ఇంచుమించు ఒకటే కథ. కానీ ఒక్క బాలకృష్ణ మాత్రమే ఇది తనకు వర్తించదనే స్థాయిలో దూసుకుపోతున్నారు.
2021 వరకు బాలయ్యది కూడా పైన చెప్పిన వాళ్ళ స్టోరీనే. కానీ అఖండ మొత్తం మార్చేసింది. కరోనా తగ్గిపోయి జనం థియేటర్లకు రావాలా వద్దాని ఆలోచిస్తున్న సమయంలో అది సాధించిన బ్లాక్ బస్టర్ వసూళ్ల వర్షం కురిపించింది. అఘోరాగా ఆయన నటనకు నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు.
విపరీతమైన పోటీలోనూ వీరసింహారెడ్డి సాధించిన రికార్డులు ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. రెగ్యులర్ మసాలాకు దూరంగా ప్రయత్నించిన భగవంత్ కేసరికి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు దొరికింది. అవార్డులు, కలెక్షన్లు రెండూ వచ్చాయి. ఏకంగా విజయ్ రీమేక్ చేసుకు స్థాయిలో అద్భుత విజయం సాధించింది.
ఇప్పుడు డాకు మహారాజ్ అదే బాటలో వెళ్తోంది. ఎక్కువ సంభాషణలు లేకుండా బాలయ్యలోని కొత్త మాస్ యాంగిల్ ని ఆవిష్కరించిన తీరు వారం తిరక్కుండానే వంద కోట్ల క్లబ్బు లోకి అడుగు పెట్టింది. ఇలా వరసగా నాలుగు బ్లాక్ బస్టర్లు దక్కించుకున్న ఘనత సీనియర్లలోనే కాదు జూనియర్లలోనూ ఎవరికీ లేదనేది వాస్తవం.
సినిమాలు పక్కనపెడితే తన ఎనర్జీతో అన్ స్టాపబుల్ షోని నాలుగు సీజన్లుగా బ్రహ్మాండంగా నడిపిస్తున్న ఘనత బాలయ్యకే చెందుతుంది. ఒకరిద్దరు మినహాయించి టాలీవుడ్ టాప్ స్టార్లంతా గెస్టులుగా వచ్చారు. కొన్ని ఎపిసోడ్ల దెబ్బకు ఏకంగా ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది.
ఇంకోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడో పర్యాయం విజయం సాధించడం బాలకృష్ణని రాజకీయంగా మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. గతంలో ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు బాలయ్య ప్లానింగ్ కి వాహ్ అంటున్నారు. ఏ స్టార్ హీరోకైనా సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. కానీ దాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కత్తి మీద సాము లాంటిది.
రీమేకులు ఎంచుకోకుండా కొత్త తరం దర్శకులతో పని చేయడానికి చూపిస్తున్న ఉత్సాహమే బాలయ్య 2.0ని హిట్ మెషీన్ గా మారుస్తోంది. ఇదిలాగే కొనసాగాలని అభిమానుల కోరిక. మోక్షజ్ఞ ఎంట్రీ దగ్గర పడుతున్న టైంలో తండ్రి సాగిస్తున్న జైత్రయాత్ర ఫ్యాన్స్ ఉత్సాహానికి నిరంతరం ఊపిరి పోస్తోంది.
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…