బాలీవుడ్ ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య విలాసవంతమైన భవంతులు, అపార్ట్ మెంట్లలో నివసించే స్టార్ హీరోలకు సైతం ప్రమాదాలు పొంచి ఉంటాయని తాజా ఉదంతం చాటుతోంది. ఇవాళ తెల్లవారకముందు 2.30 గంటల ప్రాంతంలో ముంబై బాంద్రాలో ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంటి దోపిడీకి ప్రయత్నించిన ఘటనలో తనకు తీవ్ర గాయాలు కలగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం దొంగ చొరబడ్డాక ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగిందని, అతను పొడిచాడా లేక ఆత్మరక్షణలో ప్రతిఘటించిన సైఫ్ కు అందులో భాగంగా గాయాలయ్యాయా అనే దాని మీద విచారణ జరుగుతోంది.
ఘటన జరిగిన గంటలోపే కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. భార్య కరీనా కపూర్ తో పాటు ఇద్దరు పిల్లలు అదే సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎలాంటి ముప్పు జరగలేదు. సైఫ్ కేకలు విన్నాక హుటాహుటిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని, వాటిలో రెండు తీవ్ర స్థితిని సూచిస్తున్నాయని డాక్టర్స్ రిపోర్ట్. సర్జరీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. కపూర్, ఖాన్ ఫ్యామిలీ తరఫున ఒక ప్రెస్ నోట్ వదిలారు. పోలీస్ కేసు కావడం వల్ల వదంతులు నమ్మవద్దని, చికిత్స కొనసాగుతోందని, సంయమనం పాటించాలని కోరారు.
దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించినప్పటి నుంచి అనుబంధం ఏర్పరుచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఘటన గురించి తెలిసిన వెంటనే క్షేమం కోరుకుంటూ ఎక్స్ ద్వారా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ముంబైలో ఉన్న ఇతర హీరోలు నటీనటులు వెంటనే లీలావతికి వెళ్లి సైఫ్ యోగక్షేమాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఆ మధ్య షారుఖ్, సల్మాన్ లకు ఇలాంటివి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు చెప్పడం సంచలనం రేపింది. భద్రత కూడా పెంచారు. కానీ అనూహ్యంగా సైఫ్ మీద అటాక్ జరగడం ఎవరూ ఊహించనిది. కేవలం దొంగతనమా లేకా ఇంకేదైనా కుట్రకోణం ఉందానేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది.
This post was last modified on January 16, 2025 10:30 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…