బాలీవుడ్ ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య విలాసవంతమైన భవంతులు, అపార్ట్ మెంట్లలో నివసించే స్టార్ హీరోలకు సైతం ప్రమాదాలు పొంచి ఉంటాయని తాజా ఉదంతం చాటుతోంది. ఇవాళ తెల్లవారకముందు 2.30 గంటల ప్రాంతంలో ముంబై బాంద్రాలో ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంటి దోపిడీకి ప్రయత్నించిన ఘటనలో తనకు తీవ్ర గాయాలు కలగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం దొంగ చొరబడ్డాక ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగిందని, అతను పొడిచాడా లేక ఆత్మరక్షణలో ప్రతిఘటించిన సైఫ్ కు అందులో భాగంగా గాయాలయ్యాయా అనే దాని మీద విచారణ జరుగుతోంది.
ఘటన జరిగిన గంటలోపే కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. భార్య కరీనా కపూర్ తో పాటు ఇద్దరు పిల్లలు అదే సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎలాంటి ముప్పు జరగలేదు. సైఫ్ కేకలు విన్నాక హుటాహుటిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని, వాటిలో రెండు తీవ్ర స్థితిని సూచిస్తున్నాయని డాక్టర్స్ రిపోర్ట్. సర్జరీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. కపూర్, ఖాన్ ఫ్యామిలీ తరఫున ఒక ప్రెస్ నోట్ వదిలారు. పోలీస్ కేసు కావడం వల్ల వదంతులు నమ్మవద్దని, చికిత్స కొనసాగుతోందని, సంయమనం పాటించాలని కోరారు.
దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించినప్పటి నుంచి అనుబంధం ఏర్పరుచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఘటన గురించి తెలిసిన వెంటనే క్షేమం కోరుకుంటూ ఎక్స్ ద్వారా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ముంబైలో ఉన్న ఇతర హీరోలు నటీనటులు వెంటనే లీలావతికి వెళ్లి సైఫ్ యోగక్షేమాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఆ మధ్య షారుఖ్, సల్మాన్ లకు ఇలాంటివి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు చెప్పడం సంచలనం రేపింది. భద్రత కూడా పెంచారు. కానీ అనూహ్యంగా సైఫ్ మీద అటాక్ జరగడం ఎవరూ ఊహించనిది. కేవలం దొంగతనమా లేకా ఇంకేదైనా కుట్రకోణం ఉందానేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది.
This post was last modified on January 16, 2025 10:30 am
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…