బడ్జెట్ ఎంతనేది పక్కనపెడితే సినిమాలన్నాక బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు అన్నీ ఉంటాయి. చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది, భవిష్యత్తులో కూడా ఎన్నో చూడబోతున్నాం. ఇది సహజం. పైరసీ కూడా కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వీడియో క్యాసెట్ల జమానా నుంచే ఇండస్ట్రీని పీడిస్తోంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయాక తీవ్ర రూపం దాలుస్తోంది.
తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ విషయంలో జరుగుతున్న అన్యాయం ఎంత మాత్రం సహించలేని స్థాయికి చేరుకుంటోంది. వైజాగ్ ప్రాంతంలోని ఒక ఏరియా లోకల్ కేబుల్ ఛానల్ ఈ ప్యాన్ ఇండియా మూవీని ప్రసారం చేయడం, దాని తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి.
విడుదలకు ముందు నుంచే ఈ కుట్రకు శ్రీకారం చుట్టారని ఇటీవలే ఎస్విసి సంస్థ 45 మందిపై ఫిర్యాదు చేస్తూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద విచారణ జరుగుతుండగానే టీవీలో టెలికాస్ట్ కావడం దారుణం. ఇక్కడే కాదు మొన్నెక్కడో ప్రైవేట్ బస్సులో వేసిన సాక్ష్యం బయటికొచ్చింది.
హోటల్ లో చెఫ్ తో మొదలుపెట్టి హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ దాకా అందరి దగ్గరికి పైరసీ కాపీ చేరిపోయింది. ఇది గేమ్ ఛేంజర్ కొకటే జరిగింది కాకపోయినా ఇంత స్థాయిలో పైరసీ కంటెంట్ ని మూలమూలలకు తీసుకెళ్లడం ఖండించాల్సిన విషయం. ఎస్కెఎన్, మధుర శ్రీధర్ లాంటి ప్రముఖులు గళం విప్పుతున్నారు.
గేమ్ ఛేంజర్ హెచ్డి పైరసీకి గురైతే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంలకు సైతం ఈ సెగ తాకింది. కాకపోతే క్వాలిటీ లేకపోవడం వల్ల డ్యామేజ్ తగ్గుతుంది. ఇకనైనా పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చి పైరసీని ఎలా కట్టడి చేయాలనే దాని మీద ప్రణాళిక వేసుకోవడం అవసరం.
అయితే ప్రపంచం మొత్తం కొన్ని వేలాది స్క్రీన్లలో ఒకే సినిమా రిలీజవుతున్నప్పుడు పైరసీని అరికట్టడం దుర్లభంగా మారుతోంది. మూలాలు వెతికేలోపు బోలెడు ఖర్చు కావడమే కాక థియేట్రికల్ రన్ పూర్తయిపోతోంది. అందుకే ఈ ఇష్యూలో సీరియస్ నెస్ రావడం లేదు. ఇంటర్నేషనల్ ఓటిటిలకు కూడా ఈ బెడద తప్పడం లేదు.
This post was last modified on January 16, 2025 7:44 am
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…