సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా మీనాక్షి చౌదరికి యూత్ ని ఆకర్షించే ఛాన్స్ ఉన్నప్పటికి నటనతో డామినేట్ చేసింది మాత్రం ఐశ్వర్య. వైవి రాజు భార్య భాగ్యంగా ఒకపక్క అమాయకత్వం, ఇంకోపక్క చదువులేని నిస్సహాయత, వీటిని మించి బావ అంటే విపరీతమైన ప్రేమ.
ఇన్ని కలగలసిన పక్కా పదహారణాల తెలుగు సతీమణి పాత్రలో తన బెస్ట్ ఇచ్చేసింది. గోదారి గట్టు మీద పాటలో గొప్ప విజువల్స్ లేకపోయినా వెంకీ లేని ఫ్రేమ్స్ లో ఈ అమ్మాయి చేసిన డాన్స్ మాస్ జనాలను బాగా మెప్పించింది.
నిజానికి భాగ్యంగా అనిల్ రావిపూడి మొదటి ఛాయస్ ఐశ్యర్య రాజేష్ కాదు. వేరే ఇద్దరు ముగ్గురిని అడిగాడు. కానీ నలుగురు చిన్న పిల్లల తల్లి అనేసరికి వాళ్ళు వెనుకడుగు వేశారు. కానీ కథ ప్రకారం హైలైట్ అయ్యేది బుల్లిరాజు ఒక్కడే అనే పాయింట్ గుర్తించలేకపోయారు.
దీంతో వద్దనుకున్నారు. కట్ చేస్తే క్యారెక్టర్ లో ఎంత వెయిట్ ఉందో గుర్తించిన ఐశ్యర్య రాజేష్ ఆలోచించకుండా ఎస్ చెప్పేసింది. వెంకటేష్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే తనకు ఎంత స్కోప్ ఉందో పసిగట్టింది. కామెడీ పరంగానూ ప్రూవ్ చేసుకుంది. ఉదాహరణ చెప్పాలంటే పప్పా పాండేను రోడ్డు మీద తోసే ఎపిసోడ్ చాలు.
ఇలా ఇతరులు తిరస్కరించిన విషయాన్ని ఐశ్వర్య రాజేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయినా పిల్లల తల్లిగా నటించినంత మాత్రాన ఆఫర్లకు కొదవేమి ఉండదు. మహానటిలో కీర్తి సురేష్ ఏకంగా వయసు మళ్ళిన పాత్రలో జీవించింది. దాని తర్వాత మహేష్ బాబు, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ల సరసన ఛాన్సులు వచ్చాయి.
సౌందర్య సైతం గతంలో ఇలాంటి రిస్కులు చేసే స్టార్ ఆఫర్లు దక్కించుకున్నారు. ఐశ్యర్య రాజేష్ ఆ రేంజని చెప్పడం లేదు కానీ సరైన బ్రేక్ దొరికితే మంచి అవకాశాలు తలుపు తడతాయి. టాలీవుడ్ లో అలాంటి మలుపు కోసమే ఎదురు చూసిన తెలుగమ్మాయికి ఆ కోరిక నెరవేరింది.
This post was last modified on January 15, 2025 3:12 pm
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…