క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు సాటి వచ్చే కథానాయికే బాలీవుడ్లో కనిపించలేదు. కానీ సక్సెస్ను తలకెక్కించుకుని.. అనవసర వివాదాల్లో తలదూర్చి, అతిగా మాట్లాడ్డం ద్వారా క్రమంగా తన మీద ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచుకుంది కంగనా.
రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయితే అయింది కానీ.. కథానాయికగా తన రేంజ్ మాత్రం పడిపోయింది. ఆమె సినిమాలకు కొన్నేళ్ల నుంచి మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు. ధకడ్ అనే సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడితే వసూళ్లు ఐదు కోట్లు కూడా రాని పరిస్థితి. దీని తర్వాత కంగన నుంచి రావాల్సిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఎమర్జన్సీ’ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలకే నోచుకోలేదు.
ఇక ఈ సినిమా రిలీజే కాదేమో అనుకున్న టైంలో కొత్త విడుదల తేదీ ఇచ్చారు. ఈ నెల 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే సినిమాకు పెద్దగా బజ్ లేని నేపథ్యంలో ఎలాగైనా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు కంగనా అండ్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టికెట్ల ధరలను బాగా తగ్గించి రూ.99కే సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఒకే రేట్ పెట్టేశారు.
ప్రీమియం మల్టీప్లెక్సులు కొన్ని మాత్రం రూ.112 రేటు పెట్టాయి. ముంబయి, ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ రేటుతో సినిమా చూసే అవకాశం రావడం విశేషమే. మరి ఈ డిస్కౌంట్ రేట్లతో అయినా కంగనా సినిమాను ప్రేక్షకులు చూస్తారా అన్నది ఆసక్తికరం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను పోషించడమే కాక.. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించింది కంగనా.
ఐతే బీజేపీ వాళ్లు కొన్నేళ్ల నుంచి తెర వెనుక ఉండి తీయిస్తున్న ప్రాపగండా సినిమాల్లో ఒకటిగా దీన్ని ప్రేక్షకులు భావిస్తుండడం.. కంగనా మీద పెరిగిన వ్యతిరేకత వల్ల మినిమం బజ్ క్రియేట్ కాలేదు ఈ మూవీ మీద. మరోవైపు ఇందిరా గాంధీని బ్యాడ్ లైట్లో చూపించేలా ఉన్న ఈ సినిమాను కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారు.
This post was last modified on January 15, 2025 12:59 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…