క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు సాటి వచ్చే కథానాయికే బాలీవుడ్లో కనిపించలేదు. కానీ సక్సెస్ను తలకెక్కించుకుని.. అనవసర వివాదాల్లో తలదూర్చి, అతిగా మాట్లాడ్డం ద్వారా క్రమంగా తన మీద ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచుకుంది కంగనా.
రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయితే అయింది కానీ.. కథానాయికగా తన రేంజ్ మాత్రం పడిపోయింది. ఆమె సినిమాలకు కొన్నేళ్ల నుంచి మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు. ధకడ్ అనే సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడితే వసూళ్లు ఐదు కోట్లు కూడా రాని పరిస్థితి. దీని తర్వాత కంగన నుంచి రావాల్సిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఎమర్జన్సీ’ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలకే నోచుకోలేదు.
ఇక ఈ సినిమా రిలీజే కాదేమో అనుకున్న టైంలో కొత్త విడుదల తేదీ ఇచ్చారు. ఈ నెల 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే సినిమాకు పెద్దగా బజ్ లేని నేపథ్యంలో ఎలాగైనా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు కంగనా అండ్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టికెట్ల ధరలను బాగా తగ్గించి రూ.99కే సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఒకే రేట్ పెట్టేశారు.
ప్రీమియం మల్టీప్లెక్సులు కొన్ని మాత్రం రూ.112 రేటు పెట్టాయి. ముంబయి, ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ రేటుతో సినిమా చూసే అవకాశం రావడం విశేషమే. మరి ఈ డిస్కౌంట్ రేట్లతో అయినా కంగనా సినిమాను ప్రేక్షకులు చూస్తారా అన్నది ఆసక్తికరం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను పోషించడమే కాక.. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించింది కంగనా.
ఐతే బీజేపీ వాళ్లు కొన్నేళ్ల నుంచి తెర వెనుక ఉండి తీయిస్తున్న ప్రాపగండా సినిమాల్లో ఒకటిగా దీన్ని ప్రేక్షకులు భావిస్తుండడం.. కంగనా మీద పెరిగిన వ్యతిరేకత వల్ల మినిమం బజ్ క్రియేట్ కాలేదు ఈ మూవీ మీద. మరోవైపు ఇందిరా గాంధీని బ్యాడ్ లైట్లో చూపించేలా ఉన్న ఈ సినిమాను కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారు.
This post was last modified on January 15, 2025 12:59 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…