ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రీ లోడెడ్ వెర్షన్ ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో విడుదల కానుంది. ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న థియేటర్ల వసూళ్లు డీసెంట్ గానే ఉన్నాయి. సెలవు రోజుల్లో బుక్ మై షోలో కనిష్టంగా పాతిక వేలకు పైగానే ఇప్పటికీ టికెట్లు అమ్ముడుపోవడం దానికి సాక్ష్యం.
ముఖ్యంగా ఉత్తరాదిలో స్క్రీన్ కౌంట్ ఇంకా కొనసాగుతోంది. గేమ్ ఛేంజర్ కొంత ప్రభావం చూపించినప్పటికీ మరీ తీవ్రంగా కాకపోవడం పుష్పరాజ్ కు కలిసి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ట్రాగా చూడబోతున్న సినిమాలో ఏం ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ ఉంది.
చాలా మంది మళ్ళీ చూడాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద జోరుగా ఉండటం, డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్, గేమ్ ఛేంజర్ కొనసాగింపు లాంటి కారణాల దృష్ట్యా పుష్ప 2కి ఎక్కువ థియేటర్లు అందుబాటులో లేవు. ఉన్నవి హౌస్ ఫుల్స్ పడితే అదనంగా జోడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారు.
దానికి అనుగుణంగానే మైత్రి ఒక ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. టికెట్ రేట్లు బాగా తగ్గించేసి సామాన్యులు సైతం వచ్చేలా ఆకర్షించడం అందులో మొదటిది. నాలుగు గంటలకు దగ్గరగా తక్కువ రేట్ లో ఏసి ఎంటర్ టైన్మెంట్ మంచి ఆప్షనేగా.
ఒక రోజు ముందు నుంచి కొత్త ప్రోమోలు, ట్రైలర్లు సిద్ధం చేస్తున్నారని టాక్. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళను ఆకట్టుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టారట. ఎక్స్ ట్రా 20 నిముషాల్లో పాట ఉండకపోయినా జపాన్ ఎపిసోడ్ తో పాటు పుష్ప షేఖావత్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్లు గట్రా ఇందులో ఉండబోతున్నాయనేది ఇన్ సైడ్ న్యూస్.
సంధ్య ఘటన తర్వాత అల్లు అర్జున్ దీనికి డబ్బింగ్ చెప్పారు. రీ రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ సుకుమార్ దగ్గరుండి చూసుకున్నారు. ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం భవిష్యత్తులో ఇదో కొత్త ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on January 15, 2025 11:46 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…