ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రీ లోడెడ్ వెర్షన్ ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో విడుదల కానుంది. ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న థియేటర్ల వసూళ్లు డీసెంట్ గానే ఉన్నాయి. సెలవు రోజుల్లో బుక్ మై షోలో కనిష్టంగా పాతిక వేలకు పైగానే ఇప్పటికీ టికెట్లు అమ్ముడుపోవడం దానికి సాక్ష్యం.
ముఖ్యంగా ఉత్తరాదిలో స్క్రీన్ కౌంట్ ఇంకా కొనసాగుతోంది. గేమ్ ఛేంజర్ కొంత ప్రభావం చూపించినప్పటికీ మరీ తీవ్రంగా కాకపోవడం పుష్పరాజ్ కు కలిసి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ట్రాగా చూడబోతున్న సినిమాలో ఏం ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ ఉంది.
చాలా మంది మళ్ళీ చూడాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద జోరుగా ఉండటం, డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్, గేమ్ ఛేంజర్ కొనసాగింపు లాంటి కారణాల దృష్ట్యా పుష్ప 2కి ఎక్కువ థియేటర్లు అందుబాటులో లేవు. ఉన్నవి హౌస్ ఫుల్స్ పడితే అదనంగా జోడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారు.
దానికి అనుగుణంగానే మైత్రి ఒక ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. టికెట్ రేట్లు బాగా తగ్గించేసి సామాన్యులు సైతం వచ్చేలా ఆకర్షించడం అందులో మొదటిది. నాలుగు గంటలకు దగ్గరగా తక్కువ రేట్ లో ఏసి ఎంటర్ టైన్మెంట్ మంచి ఆప్షనేగా.
ఒక రోజు ముందు నుంచి కొత్త ప్రోమోలు, ట్రైలర్లు సిద్ధం చేస్తున్నారని టాక్. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళను ఆకట్టుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టారట. ఎక్స్ ట్రా 20 నిముషాల్లో పాట ఉండకపోయినా జపాన్ ఎపిసోడ్ తో పాటు పుష్ప షేఖావత్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్లు గట్రా ఇందులో ఉండబోతున్నాయనేది ఇన్ సైడ్ న్యూస్.
సంధ్య ఘటన తర్వాత అల్లు అర్జున్ దీనికి డబ్బింగ్ చెప్పారు. రీ రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ సుకుమార్ దగ్గరుండి చూసుకున్నారు. ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం భవిష్యత్తులో ఇదో కొత్త ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on January 15, 2025 11:46 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…