ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్ పైకి వెళ్లకుండానే నాలుగు నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం జైలర్ 2 కే సాధ్యమయ్యింది. మొన్నటి ఏడాది విడుదలై తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కొనసాగింపుకు రంగం సిద్ధమయ్యింది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా రిటైర్డ్ పోలీస్ గా ముత్తువేల్ పాండియన్ చేయబోయే విధ్వంసాలు ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. దానికి శాంపిల్ గానే అనౌన్స్ మెంట్ టీజర్ వదిలారు.
నెల్సన్, అనిరుద్ ఎలెక్ట్రిక్ మెడిటేషన్ లో ఉండగా తలుపులు బద్దలు కొట్టుకుని గుండాలు రావడం, వెనుకే రజనీకాంత్ వాళ్ళను తుపాకీ, కత్తితో ఊచకోత కోస్తూ రావడం మాములు వయొలెంట్ గా లేదు. తర్వాత బయటికి వచ్చాక మిలటరీ వార్ ట్యాంక్స్ తో వందల కొద్దీ గూండాలు మెషీన్ గన్లు గురి పెడితే అవన్నీ గాల్లో పేలిపోయి స్టైలిష్ గా రజని వాటి ముందు నుంచి నడుచుకుంటూ రావడం మాములు ఎలివేషన్ ఇవ్వలేదు.
యధావిధిగా అనిరుద్ సిగ్నేచర్ బీజీఎమ్ దాని స్థాయిని ఇంకాస్త పెంచింది. ఇంకా చిత్రీకరణ మొదలుకాలేదు కాబట్టి క్యాస్టింగ్ తదితర వివరాలు ఏవి వెల్లడించలేదు.
చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2 కొనసాగింపు మొదటి భాగం క్లైమాక్స్ నుంచే ఉంటుంది. కొడుకు పాత్ర, విలన్ తప్ప మిగిలిన అందరూ జీవించే ఉన్నారు కనక వాళ్ళను కొనసాగిస్తూనే కొత్త గ్యాంగ్ ని సెట్ చేయబోతున్నారు. మనవడు, కోడలు, భార్యతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన మరో ట్విస్టు జోడించారని అంటున్నారు.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలి పూర్తి చేసే పనిలో ఉన్న రజని ఈ వేసవిలోగా ఫ్రీ అవుతారు. వెంటనే జైలర్ 2 స్టార్టవుతుంది. 2026 సంక్రాంతి లేదా ఆపై వేసవి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బాహుబలి 2, కెజిఎఫ్ 2, పుష్ప 2 తరహాలో జైలర్ 2 సంచలనమవుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.
This post was last modified on January 14, 2025 6:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…