సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగాక అభిమానుల్లో హీరోయిజం పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఒకప్పుడు రిలీజ్ రోజు హడావిడితో మొదలై వంద రోజో లేదా సిల్వర్ జూబ్లీకి హల్చల్ చేయడం దగ్గర ముగిసేది. కానీ ఇప్పుడలా కాదు. ట్విట్టర్. ఇన్స్ టా, ఫేస్ బుక్ లాంటివి వచ్చాక నిత్యం అదే ప్రపంచంలో మునిగి తేలుతూ హీరోల భజనలు, ట్రోల్స్ లో బోలెడంత సమయాన్ని వృథా చేసుకుంటున్న యువత కోట్లలో ఉంటోంది.
స్వంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా స్టార్లను ప్రేమించడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఈ ధోరణి కొన్నేళ్ల క్రితం ఏకంగా హత్యలు చేయడం దాకా వెళ్లిన సంగతి గుర్తే.
తాజాగా దీని మీద అజిత్ గట్టి చురకలు వేశాడు. దుబాయ్ లో జరిగిన 24హెచ్ రేసులో జయకేతనం ఎగరేశాక మీడియాతో కొన్ని ముచ్చట్లు పంచుకున్నాడు. అందులో భాగంగా మాట్లాడుతూ లాంగ్ లివ్ విజయ్, లాంగ్ లివ్ అజిత్ అంటూ మా గురించి ప్రార్థించకుండా ముందు ఎవరికి వారు వాళ్ళ స్వంత జీవితాల గురించి ఆలోచించుకుంటే అందరూ బాగుంటారని, నేను సంతోషంగా ఉన్నానని తనలాగే అభిమానులు కూడా బాగుండాలని కోరుకుంటానని హితవు పలికారు.
లైఫ్ చాలా చిన్నదని మన మనవళ్లు మనవరాళ్లు గుర్తు పెట్టుకునేంత అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడేం చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టాలని కోరారు.
ఒకరకంగా అజిత్ మాటలు చెంపపెట్టులాంటివి. హీరో నీ అభిమానించడం టికెట్ కొని సినిమా చూడటం దగ్గర ఆగిపోతే మంచిది. అంతే తప్ప అవతలి వర్గాన్ని నష్టపరచాలని ట్రోల్స్ చేయడం, పైరసీ ప్రింట్లను షేర్ చేసుకోవడం, కలెక్షన్ల గురించి బురద జల్లుకోవడం లాంటివి ఎలాంటి ప్రయోజనం ఇవ్వకపోగా మరింత కలవరానికి గురి చేస్తాయి.
తనకు అభిమాన సంఘాలే వద్దని అధికారికంగా నిషేదించిన హీరోగా అజిత్ మాటలు ఆషామాషీగా అనిపించవు. తమిళంలో అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవల్లాగే ఈ మధ్య తెలుగులోనూ స్టార్ హీరోల అభిమానుల మధ్య పెద్ద రచ్చలే జరుగుతున్నాయి.
This post was last modified on January 14, 2025 12:34 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…