ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి క్వాలిటీతో పైరసీ ప్రింట్ ప్రత్యక్షం కావడం అభిమానులను నివ్వెరపరిచింది. రెగ్యులర్ గా ఆన్ లైన్ వ్యవహారాలతో టచ్ ఉన్న వాళ్లకు ఇది తెలిసిన విషయమే. తక్కువ నాణ్యతతో సరిగా వినిపించని థియేటర్ సౌండ్ తో లీకులు జరగడం ఎప్పటి నుంచో ఉన్నదే.
కానీ ఇలా షాకిచ్చేలా సినిమా మొత్తం బయటికి వచ్చేయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీని వెనుక ఉన్నదెవరో కనుక్కునేందుకు నిర్మాత దిల్ రాజు బృందం రంగంలోకి దిగింది. అసలేం జరిగిందనే దాని మీద పోలీసులకు కంప్లయింట్ చేయడం నుంచి చర్యలు మొదలుపెట్టింది.
గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే పలువురు టీమ్ లోని కీలక సభ్యులకు కొందరు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మెసేజులు పంపించి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇవ్వకపోతే హెచ్డి ప్రింట్ లీక్ చేస్తామని బెదిరించడంతో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన ట్విస్టులను ఎక్స్ తదితర మాధ్యమాల్లో షేర్ చేశారు.
రిలీజ్ తర్వాత వాళ్ళు అన్నంత పని చేయడంతో పాటు వివిధ మార్గాల్లో వేలాది మందికి షేర్ చేశారు. దాని ప్రభావం వసూళ్ల మీద తీవ్రంగా పడింది. ఈ కుట్ర వెనుక 45 మందికి పైగా ఉన్నారని గుర్తించి పూర్తి ఆధారాలతో పాటు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
నిజానిజాలు ఎలాగూ బయట పడతాయి కానీ ఇది మాత్రం ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిన దారుణం. మూడు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉండి, వందల కోట్ల పెట్టుబడిని మోస్తూ, ఇండియా నుంచి ఓవర్సీస్ దాకా పెద్ద బిజినెస్ జరుపుకుని థియేటర్లలో వచ్చిన సినిమా ఇలా అన్యాయానికి గురి కావడం చిన్న నేరం కాదు.
పైరసీ కట్టడికి ప్రభుత్వాల నుంచి ఇంకా ఎక్కువ సహకారం కావాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తున్న టైంలో గేమ్ ఛేంజర్ ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది. గత రెండు నెలలుగా ఇతర తమిళ, హిందీ సినిమాలు కూడా హెచ్డి పైరసీ బారిన పడ్డాయి. త్వరగా దోషులను బయటికి తేవడం అత్యవసరం.
This post was last modified on January 13, 2025 5:03 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…