సంక్రాంతి రిలీజుల్లో రెండు వచ్చేశాయి. డాకు మహారాజ్ సూపర్ హిట్ దిశగా వెళ్తున్నట్టు మొదటి రోజు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ మిక్స్డ్ టాక్ కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. హిందీలో పర్వాలేదనుకున్నా తెలుగులో మాత్రం నెమ్మదించిపోవడం బయ్యర్లను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.
సంక్రాంతి సెలవులు జనవరి 19 దాకా ఉన్నాయి కాబట్టి వీలైనంత ఆలోపే రాబట్టుకోవడం కీలకం కానుంది. మొదటి రోజు వసూళ్లను 186 కోట్లుగా ప్రకటించిన నిర్మాణ సంస్థ తర్వాత సైలెంటయ్యింది. బహిర్గత పరిచిన నెంబర్ల మీద సోషల్ మీడియాలో వచ్చిన నెగటివిటినే కారణంగా చెప్పుకుంటున్నారు.
పండగ టాపిక్ ని కాసేపు పక్కనపెడితే గేమ్ ఛేంజర్ కనక ఇప్పుడు కాకుండా ముందు అనుకున్నట్టు డిసెంబర్ లో సోలోగా లేదా ఫిబ్రవరి మార్చిలో సింగల్ గా వచ్చి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఒకవేళ నిజంగా అలా చేసుకుంటే కంటెంట్ అయితే మారేది కాదు కానీ రెస్పాన్స్ పరంగా మరింత మెరుగ్గా ఉండేదన్న మాట వాస్తవం.
గత ఏడాది పుష్ప 2, దేవర, కల్కి లాంటివన్నీ ఏ కాంపిటేషన్ లేకుండా వచ్చినవి. కానీ గేమ్ ఛేంజర్ ఒకేసారి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంతో తలపడాల్సి రావడంతో చిక్కులు తప్పలేదు. ఇక్కడ తమిళ వెర్షన్ ప్రస్తావన కూడా తేవాలి.
దర్శకుడు శంకర్ బ్రాండ్ మీద ఎక్కువ మార్కెటింగ్ జరిగిన గేమ్ ఛేంజర్ కు తమిళంలో విశాల్ మదగజరాజా, బాలా వనంగాన్, జయం రవి కాథలిక్క నేరమిల్లై స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. తెలుగుని మినహాయించి కేవలం తమిళం మాత్రమే తీసుకున్నా గేమ్ ఛేంజర్ కు పది కోట్ల లోపే వచ్చిందనే ట్రేడ్ టాక్ ఆందోళన కలిగించేదే.
ఇండియన్ 2, ఐ కన్నామెరుగ్గా ఉన్నా గేమ్ ఛేంజర్ కేవలం పోటీలో ఉండటం వల్లే ఎక్కువ ప్రభావితం కావడం రేంజ్ మారుస్తోంది. ఇంకోవైపు ప్రొడక్షన్ హౌస్, హీరో, దర్శకుడు అందరూ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను పక్కన పెట్టేశారు. కనీసం వారం పది రోజులు సౌండ్ చేసి ఉంటే బాగుండేదని మెగా ఫ్యాన్స్ కామెంట్.
This post was last modified on January 13, 2025 2:15 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…