కరోనా-లాక్డౌన్ కారణంగా మార్చి రెండో వారంలో మూతపడ్డ థియేటర్లలను ఈ గురువారం నుంచి థియేటర్లను తెరుచుకోవడానికి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఐతే థియేటర్లకు పండుగ రోజంటే కొత్త చిత్రాలు విడుదలయ్యే శుక్రవారమే కాబట్టి ఆ రోజు నుంచే థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. కానీ అన్నీ మాత్రం కాదు.
దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా సింగిల్ స్క్రీన్లు తెరుచుకుంటున్న దాఖలాలైతే కనిపించడం లేదు. లీడింగ్ మల్టీప్లెక్స్ ఛైన్స్ మాత్రం స్క్రీన్లను పున:ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశాయి. శానిటైజేషన్ సహా అన్నీ చేసి స్క్రీన్లను తెరుస్తున్నాయి. మరి వీటిలో ప్రదర్శించడానికి సినిమాలేవన్నది ప్రశ్న. కొత్త చిత్రాలైతే ఏవీ విడుదల కావట్లేదు. ఓటీటీల్లో నడుస్తున్న సినిమాలను థియేటర్లలో నడిపించే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో లాక్డౌన్కు ముందు థియేటర్లలో ఆడుతున్న సినిమాలనే రీ రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్లో ఐదు సినిమాల రీ రిలీజ్ గురించి ప్రకటన కూడా వచ్చింది. జనవరిలో విడుదలై దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ ఏడాదికి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన అజయ్ దేవగణ్ సినిమా ‘తానాజీ’ ఈ వీకెండ్లో థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాల్ని ఓ మోస్తరుగా అయినా థియేటర్లకు ఆకర్షించగల సినిమా ఇదే అని భావిస్తున్నారు. దీంతో పాటు తాప్సి హిట్ చిత్రం ‘తప్పడ్’, ఆయుష్మాన్ ఖురాని సక్సెస్ ఫుల్ మూవీ ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ కూడా ఈ వీకెండ్లో థియేటర్లలోకి దిగుతున్నాయి.
డిజాస్టర్గా నిలిచిన ఆదిత్యరాయ్ కపూర్ ‘మలంగ్’ కూడా రీ రిలీజ్ కాబోతోంది. దివంగత సుశాంత్ రాజ్పుత్తో కలిసి సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ చేసిన తన డెబ్యూ మూవీ ‘కేదార్ నాథ్’ కూడా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఈ ఐదు సినిమాలు ప్రస్తుత పరిస్థఇతుల్లో ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి.
This post was last modified on October 15, 2020 10:00 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…