ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా పాట లేకపోవడం. ఎక్కడో ఒక చోటు ఉంటుంది లెమ్మని ఎదురు చూస్తే ఎండ్ కార్డు దాకా రాకపోవడం చూసి నిరాశ చెందిన వాళ్ళలో అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ ఉన్నారు.
జనవరి 14 నుంచి జోడిస్తామని ప్రకటించారు కానీ మొదటి నాలుగు రోజులు ఎందుకు లేదనే అనుమానం అందరి మెదళ్లలో అలాగే ఉండిపోయింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏ కారణంతో మంచి సాంగ్ తీసేయాల్సి వచ్చిందో వివరించాడు.
తన మాటల ప్రకారం గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు చరణ్, కియారా లవ్ ట్రాక్ కి ఎక్కువ స్కోప్ పెట్టారు. దానికి అనుగుణంగానే మంచి మెలోడీ ఉంటే బాగుంటుందని భావించి హైరానా కంపోజ్ చేసుకుని రికార్డు చేశారు. తీరా చిత్రీకరణ అయిపోయి ఫైనల్ కాపీ చూసుకునే టైంలో ఫ్లోకి ఇది తగదని అనిపించింది.
ఫస్ట్ హాఫ్ లో ధోప్, రామచ్చా సరిపోయాయి. రెండో సగంలో కొండదేవర, అరుగు మీద సందర్భానికి తగ్గట్టు సింకయ్యాయి. రామ్ నందన్ సీరియస్ గా సిఎంగా ఎంపికయ్యే సీన్ తర్వాత హైరానా అంటూ డ్యూయెట్ పెడితే భావ్యంగా ఉండదని భావించి లేపేశారు. దీంతో తెరమీద ఒక ఖరీదైన పాట మిస్ అయ్యింది.
మళ్ళీ దీని కోసమే జనం థియేటర్లకు మరోసారి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉంటుందట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే విఎఫెక్స్, ఇతర సాంకేతిక సమస్యలు ఏవి లేకుండా హైరానా సిద్ధంగానే ఉందట. కాకపోతే పైన చెప్పిన నేపధ్యం వల్ల ఫ్యాన్స్ మిస్ అయిపోయారు.
ఇండియాలోనే మొదటి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన పాటగా దీని గురించి తమన్, శంకర్ గతంలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, బిటిఎస్ వీడియో రెండు చేశారు. తీరా చూస్తే ఇప్పుడేమో అసలు పాటే లేదు. అయినా ఉంచితే అడ్డం వచ్చిందని రాస్తారు, తీసేస్తే ఇలా ఎందుక చేశారని నిలదీస్తారని, ఇదో ట్రిక్కి సిచువేషనని తమన్ చెప్పడం ఫైనల్ ట్విస్ట్.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…