ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా పాట లేకపోవడం. ఎక్కడో ఒక చోటు ఉంటుంది లెమ్మని ఎదురు చూస్తే ఎండ్ కార్డు దాకా రాకపోవడం చూసి నిరాశ చెందిన వాళ్ళలో అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ ఉన్నారు.
జనవరి 14 నుంచి జోడిస్తామని ప్రకటించారు కానీ మొదటి నాలుగు రోజులు ఎందుకు లేదనే అనుమానం అందరి మెదళ్లలో అలాగే ఉండిపోయింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏ కారణంతో మంచి సాంగ్ తీసేయాల్సి వచ్చిందో వివరించాడు.
తన మాటల ప్రకారం గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు చరణ్, కియారా లవ్ ట్రాక్ కి ఎక్కువ స్కోప్ పెట్టారు. దానికి అనుగుణంగానే మంచి మెలోడీ ఉంటే బాగుంటుందని భావించి హైరానా కంపోజ్ చేసుకుని రికార్డు చేశారు. తీరా చిత్రీకరణ అయిపోయి ఫైనల్ కాపీ చూసుకునే టైంలో ఫ్లోకి ఇది తగదని అనిపించింది.
ఫస్ట్ హాఫ్ లో ధోప్, రామచ్చా సరిపోయాయి. రెండో సగంలో కొండదేవర, అరుగు మీద సందర్భానికి తగ్గట్టు సింకయ్యాయి. రామ్ నందన్ సీరియస్ గా సిఎంగా ఎంపికయ్యే సీన్ తర్వాత హైరానా అంటూ డ్యూయెట్ పెడితే భావ్యంగా ఉండదని భావించి లేపేశారు. దీంతో తెరమీద ఒక ఖరీదైన పాట మిస్ అయ్యింది.
మళ్ళీ దీని కోసమే జనం థియేటర్లకు మరోసారి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉంటుందట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే విఎఫెక్స్, ఇతర సాంకేతిక సమస్యలు ఏవి లేకుండా హైరానా సిద్ధంగానే ఉందట. కాకపోతే పైన చెప్పిన నేపధ్యం వల్ల ఫ్యాన్స్ మిస్ అయిపోయారు.
ఇండియాలోనే మొదటి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన పాటగా దీని గురించి తమన్, శంకర్ గతంలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, బిటిఎస్ వీడియో రెండు చేశారు. తీరా చూస్తే ఇప్పుడేమో అసలు పాటే లేదు. అయినా ఉంచితే అడ్డం వచ్చిందని రాస్తారు, తీసేస్తే ఇలా ఎందుక చేశారని నిలదీస్తారని, ఇదో ట్రిక్కి సిచువేషనని తమన్ చెప్పడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on January 11, 2025 11:19 pm
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…