హీరోయిన్ లు అంటే… చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం… వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనం ఆశ్చర్యపోయే దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నందినీ రాయి… మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న నందినీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె తన మోకాళ్లపై మెట్లు ఎక్కుతున్న వీడియో ఆమోలోని భక్తి ప్రపత్తులను తెలియజేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నందినీ రాయి నటించారు. సీనియర్ డైరెక్టర్ నీలకంఠ తెరకెక్కించిన మాయ చిత్రంలోనూ ఆమె లీడ్ రోల్ లో కనిపించింది.
ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించినా నందినికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సాగుతున్న నందిని… తాజాగా పలు సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంది.
ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆమె తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కాలని నిర్ణయించుకున్న నందిని అలిపిరి నుంచి మెట్ల మార్గం మీదుగా వెంకన్న వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ కనిపించారు.
సెలబ్రిటీ అయి ఉండి.. అది కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నందిని ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కుతుండటం పలువురు భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోకాళ్లపై వెంకన్న వద్దకు వెళుతున్న తన వీడియోను నందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 11, 2025 3:50 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…