Movie News

మోకాళ్లపై వెంకన్న చెంతకు టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ లు అంటే… చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం… వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనం ఆశ్చర్యపోయే దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నందినీ రాయి… మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న నందినీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె తన మోకాళ్లపై మెట్లు ఎక్కుతున్న వీడియో ఆమోలోని భక్తి ప్రపత్తులను తెలియజేస్తోంది.

తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నందినీ రాయి నటించారు. సీనియర్ డైరెక్టర్ నీలకంఠ తెరకెక్కించిన మాయ చిత్రంలోనూ ఆమె లీడ్ రోల్ లో కనిపించింది.

ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించినా నందినికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సాగుతున్న నందిని… తాజాగా పలు సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంది.

ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆమె తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కాలని నిర్ణయించుకున్న నందిని అలిపిరి నుంచి మెట్ల మార్గం మీదుగా వెంకన్న వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ కనిపించారు.

సెలబ్రిటీ అయి ఉండి.. అది కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నందిని ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కుతుండటం పలువురు భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోకాళ్లపై వెంకన్న వద్దకు వెళుతున్న తన వీడియోను నందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

This post was last modified on January 11, 2025 3:50 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago