హీరోయిన్ లు అంటే… చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం… వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనం ఆశ్చర్యపోయే దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నందినీ రాయి… మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న నందినీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె తన మోకాళ్లపై మెట్లు ఎక్కుతున్న వీడియో ఆమోలోని భక్తి ప్రపత్తులను తెలియజేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నందినీ రాయి నటించారు. సీనియర్ డైరెక్టర్ నీలకంఠ తెరకెక్కించిన మాయ చిత్రంలోనూ ఆమె లీడ్ రోల్ లో కనిపించింది.
ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించినా నందినికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సాగుతున్న నందిని… తాజాగా పలు సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంది.
ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆమె తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కాలని నిర్ణయించుకున్న నందిని అలిపిరి నుంచి మెట్ల మార్గం మీదుగా వెంకన్న వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ కనిపించారు.
సెలబ్రిటీ అయి ఉండి.. అది కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నందిని ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కుతుండటం పలువురు భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోకాళ్లపై వెంకన్న వద్దకు వెళుతున్న తన వీడియోను నందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 11, 2025 3:50 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…