హీరోయిన్ లు అంటే… చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం… వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనం ఆశ్చర్యపోయే దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నందినీ రాయి… మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న నందినీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె తన మోకాళ్లపై మెట్లు ఎక్కుతున్న వీడియో ఆమోలోని భక్తి ప్రపత్తులను తెలియజేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా నందినీ రాయి నటించారు. సీనియర్ డైరెక్టర్ నీలకంఠ తెరకెక్కించిన మాయ చిత్రంలోనూ ఆమె లీడ్ రోల్ లో కనిపించింది.
ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించినా నందినికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సాగుతున్న నందిని… తాజాగా పలు సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంది.
ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆమె తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కాలని నిర్ణయించుకున్న నందిని అలిపిరి నుంచి మెట్ల మార్గం మీదుగా వెంకన్న వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోకాళ్ల పర్వతం వద్ద ఆమె మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ కనిపించారు.
సెలబ్రిటీ అయి ఉండి.. అది కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నందిని ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కుతుండటం పలువురు భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోకాళ్లపై వెంకన్న వద్దకు వెళుతున్న తన వీడియోను నందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 11, 2025 3:50 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…