నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నబాలయ్య.. బాబీ దర్శకత్వంలో చేసిన డాకుపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న బాలయ్య… ఈ ఘటనకు సంతాప సూచకంగా అనంతపురంలో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు శుక్రవారం హైదరాబాద్ లో డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైనా కూడా బాలయ్య,… తిరుపతి తొక్కిసలాటను మరిచిపోలేకపోయారు. సినిమా ఫంక్షన్ అయినప్పటికీ… తిరుపతి ప్రమాదాన్ని ప్రస్తావించిన బాలయ్య… తన సున్నిత మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని బాలయ్య అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వెంకన్న భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటనలు ఇప్పటిదాకా జరగలేదన్న బాలయ్య… పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగకూడని ఘటన జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విషాద ఘటనలను నటులు గానీ, సినీ ప్రముఖులు గానీ పెద్దగా ప్రస్తావించరు. ఎంతసేపు తాము తెరకెక్కించిన సినిమా విజయవంతం కావాలన్న జోష్ లో కొనసాగే సినీ జనం… ప్రీ రిలీజ్ వంటి ఫుల్ జోష్ కనిపించే పంక్షన్లలో అసలు ప్రస్తావించరు. ఇక బాలయ్య లాంటి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు అయితే ఈ ఘటనల జోలికే వెళ్లరు. అయితే అందుకు విరుద్ధంగా ఎంత సినిమా వేదిక అయినా కూడా తన మనసును కలచివేసిన తిరుపతి తొక్కిసలాటను బాలయ్య ప్రీ రిలీజ్ వేదిక మీద ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. బాలయ్య వ్యాఖ్యలు ఆయనలోని సున్నితత్వానికి నిదర్శనమని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…