Movie News

ఆ ఘటన కలచివేసింది: బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నబాలయ్య.. బాబీ దర్శకత్వంలో చేసిన డాకుపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న బాలయ్య… ఈ ఘటనకు సంతాప సూచకంగా అనంతపురంలో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు శుక్రవారం హైదరాబాద్ లో డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేడుకకు హాజరైనా కూడా బాలయ్య,… తిరుపతి తొక్కిసలాటను మరిచిపోలేకపోయారు. సినిమా ఫంక్షన్ అయినప్పటికీ… తిరుపతి ప్రమాదాన్ని ప్రస్తావించిన బాలయ్య… తన సున్నిత మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని బాలయ్య అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వెంకన్న భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటనలు ఇప్పటిదాకా జరగలేదన్న బాలయ్య… పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగకూడని ఘటన జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విషాద ఘటనలను నటులు గానీ, సినీ ప్రముఖులు గానీ పెద్దగా ప్రస్తావించరు. ఎంతసేపు తాము తెరకెక్కించిన సినిమా విజయవంతం కావాలన్న జోష్ లో కొనసాగే సినీ జనం… ప్రీ రిలీజ్ వంటి ఫుల్ జోష్ కనిపించే పంక్షన్లలో అసలు ప్రస్తావించరు. ఇక బాలయ్య లాంటి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు అయితే ఈ ఘటనల జోలికే వెళ్లరు. అయితే అందుకు విరుద్ధంగా ఎంత సినిమా వేదిక అయినా కూడా తన మనసును కలచివేసిన తిరుపతి తొక్కిసలాటను బాలయ్య ప్రీ రిలీజ్ వేదిక మీద ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. బాలయ్య వ్యాఖ్యలు ఆయనలోని సున్నితత్వానికి నిదర్శనమని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

Satya

Recent Posts

భ్రమలో ఉన్న ఫ్లాప్ దర్శకుడు

తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…

41 minutes ago

ఐపీఎల్ 2026 అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…

1 hour ago

ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…

2 hours ago

జెన్‌-జీ రాజకీయం మొదలుపెట్టిన పవన్

ఏపీ అధికార పార్టీ జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో యువ‌త‌రాన్ని ఆకర్షించేందుకు..…

3 hours ago

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

5 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

7 hours ago