Movie News

ఆ ఘటన కలచివేసింది: బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నబాలయ్య.. బాబీ దర్శకత్వంలో చేసిన డాకుపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న బాలయ్య… ఈ ఘటనకు సంతాప సూచకంగా అనంతపురంలో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు శుక్రవారం హైదరాబాద్ లో డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేడుకకు హాజరైనా కూడా బాలయ్య,… తిరుపతి తొక్కిసలాటను మరిచిపోలేకపోయారు. సినిమా ఫంక్షన్ అయినప్పటికీ… తిరుపతి ప్రమాదాన్ని ప్రస్తావించిన బాలయ్య… తన సున్నిత మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని బాలయ్య అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వెంకన్న భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటనలు ఇప్పటిదాకా జరగలేదన్న బాలయ్య… పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగకూడని ఘటన జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విషాద ఘటనలను నటులు గానీ, సినీ ప్రముఖులు గానీ పెద్దగా ప్రస్తావించరు. ఎంతసేపు తాము తెరకెక్కించిన సినిమా విజయవంతం కావాలన్న జోష్ లో కొనసాగే సినీ జనం… ప్రీ రిలీజ్ వంటి ఫుల్ జోష్ కనిపించే పంక్షన్లలో అసలు ప్రస్తావించరు. ఇక బాలయ్య లాంటి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు అయితే ఈ ఘటనల జోలికే వెళ్లరు. అయితే అందుకు విరుద్ధంగా ఎంత సినిమా వేదిక అయినా కూడా తన మనసును కలచివేసిన తిరుపతి తొక్కిసలాటను బాలయ్య ప్రీ రిలీజ్ వేదిక మీద ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. బాలయ్య వ్యాఖ్యలు ఆయనలోని సున్నితత్వానికి నిదర్శనమని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

This post was last modified on January 11, 2025 10:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

3 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

5 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago