నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నబాలయ్య.. బాబీ దర్శకత్వంలో చేసిన డాకుపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురి చేసింది. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న బాలయ్య… ఈ ఘటనకు సంతాప సూచకంగా అనంతపురంలో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు శుక్రవారం హైదరాబాద్ లో డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైనా కూడా బాలయ్య,… తిరుపతి తొక్కిసలాటను మరిచిపోలేకపోయారు. సినిమా ఫంక్షన్ అయినప్పటికీ… తిరుపతి ప్రమాదాన్ని ప్రస్తావించిన బాలయ్య… తన సున్నిత మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని బాలయ్య అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వెంకన్న భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటనలు ఇప్పటిదాకా జరగలేదన్న బాలయ్య… పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగకూడని ఘటన జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విషాద ఘటనలను నటులు గానీ, సినీ ప్రముఖులు గానీ పెద్దగా ప్రస్తావించరు. ఎంతసేపు తాము తెరకెక్కించిన సినిమా విజయవంతం కావాలన్న జోష్ లో కొనసాగే సినీ జనం… ప్రీ రిలీజ్ వంటి ఫుల్ జోష్ కనిపించే పంక్షన్లలో అసలు ప్రస్తావించరు. ఇక బాలయ్య లాంటి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు అయితే ఈ ఘటనల జోలికే వెళ్లరు. అయితే అందుకు విరుద్ధంగా ఎంత సినిమా వేదిక అయినా కూడా తన మనసును కలచివేసిన తిరుపతి తొక్కిసలాటను బాలయ్య ప్రీ రిలీజ్ వేదిక మీద ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. బాలయ్య వ్యాఖ్యలు ఆయనలోని సున్నితత్వానికి నిదర్శనమని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on January 11, 2025 10:29 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…